News May 19, 2024

NLG: ఇక పంచాయతీ ఎన్నికలపై దృష్టి

image

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పంచాయతీ ఎన్నికలపై అధికారులు దృష్టి సారించింది. ఫిబ్రవరిలోనే పంచాయతీలకు పదవీ కాలం ముగియడంతో అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని 1,740 గ్రామ పంచాయతీలకు జూన్ చివరి వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆశావహులు పోటీ చేసేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

Similar News

News December 21, 2025

NLG: రికార్డ్.. ఒక్కరోజే 56,734 కేసుల పరిష్కారం

image

నల్గొండ జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 56,734 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఏర్పాటు చేసిన 16 బెంచీల ద్వారా పెండింగ్‌, ప్రి-లిటిగేషన్‌ కేసులను కొలిక్కి తెచ్చారు. ఇందులో భాగంగా బాధితులకు రూ.4.93 కోట్ల బీమా సొమ్ము, బ్యాంకు రుణాల కింద రూ. 37.76 లక్షలు, సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో రూ. 2.73 లక్షల రికవరీ ఇప్పించారు.

News December 21, 2025

ఎలక్షన్ ఎఫెక్ట్.. మంద కొడిగానే బియ్యం పంపిణీ..!

image

జిల్లాలో రేషన్ బియ్యం విక్రయాలు డిసెంబర్ మాసంలో మందకొడిగా సాగాయి. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ప్రభావం ప్రజా పంపిణీ కేంద్రాలపై పడింది. పల్లె పోరులో చాలా బిజీగా ఉన్న లబ్ధిదారులు రేషన్ దుకాణాల వంక చూడకపోవడంతో ఆయా దుకాణాలలో బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. 23 మండలాల్లో బియ్యం పంపిణీ 35 శాతానికి మించలేదు. దీంతో మరో రెండు మూడు రోజులపాటు సరఫరా చేయనున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు.

News December 21, 2025

NLG: బిల్లులు వచ్చేనా.. ఇక్కట్లు తొలిగేనా?!

image

రెండేళ్ల నుంచి గ్రామపంచాయతీలలో బిల్లులు పెండింగ్లో ఉండడంతో గ్రామ కార్యదర్శులు అనేక అవస్థలు పడుతున్నారు. గత రెండేళ్ల నుంచి గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో పైఅధికారుల సూచన మేరకు తామే వివిధ అభివృద్ధి పనుల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాల్లో పనులు చేయించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నామని తెలిపారు. రెండేళ్ల నుంచి బిల్లులు పెండింగ్లోనే ఉండడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.