News March 14, 2025
NLG: ఇది ప్రకృతి హోలీ

హోలీ పండగ రోజు ఇద్దరు చిన్నారులు ఆదర్శంగా నిలిచారు. మార్కెట్లో దొరికే కృత్రిమ రంగులకు స్వస్తి పలికారు. బీబీనగర్ మం. పరిధిలోని పడమటి సోమారం గ్రామానికి చెందిన సుభిక్షిత్, అభిజ్ఞ అన్నాచెల్లెలు. హోలీ పండగ కోసం తమ గ్రామంలో విరబూసిన మోదుగు పూలను సేకరించారు. స్వయంగా రంగు నీళ్లు సిద్ధం చేశారు. సహజసిద్ధమైన ఈ నీళ్లను చల్లుకుంటూ హోలీ ఆడారు. ఇక మీదటైనా ప్రకృతి నడుమ ‘హోలీ’ జరుపుకుందాం.
Similar News
News November 23, 2025
సాయి శత జయంతి: 14 ఏళ్లకే అవతార ప్రకటన

ఆధ్యాత్మిక సారథి, ప్రేమకు వారధి అయిన శ్రీ సత్యసాయిబాబా శత జయంతి నేడు ఘనంగా జరుగుతోంది. 14 ఏళ్ల వయసులోనే బాబాగా అవతార ప్రకటన చేసిన స్వామి, కొన్నేళ్లుగా విద్య, వైద్యం వంటి అనేక సేవలు అందించారు. ఈ నిస్వార్థ సేవలు 140 దేశాల్లో సాయి సేవాదళ్ ద్వారా విస్తరించాయి. భక్తులు లక్షలాదిగా తరలివచ్చి వేడుకల్లో పాల్గొంటున్నారు.
News November 23, 2025
శ్రీకాకుళం: ఘోర ప్రమాదం..నలుగురు మృతి

కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద హైవేపై ఆదివారం వేకువజామున ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భోరోసింగ్ పవర్ (60), విజయ్ సింగ్ తోమర్ (65), ఉషీర్ సింగ్ (62), సంతోషి భాయ్ (62), డెడ్ బాడీలు కోటబొమ్మాళి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు.కోటబొమ్మాళి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేశారు.
News November 23, 2025
MNCL: కొడుకుపై గొడ్డలితో దాడి చేసిన తండ్రి అరెస్ట్

డబ్బుల కోసం కొడుకుపై దాడి చేసిన తండ్రిని అరెస్ట్ చేసినట్లు రెబ్బెన పోలీసులు తెలిపారు. కిషన్ జీతం డబ్బులు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న తండ్రి శంకర్ నాయక్ శుక్రవారం భోజనం చేస్తున్న కొడుకుపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో కిషన్ తీవ్రంగా గాయపడటంతో కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శనివారం శంకర్ నాయక్ను అరెస్ట్ చేశారు.


