News March 14, 2025
NLG: ఇది ప్రకృతి హోలీ

హోలీ పండగ రోజు ఇద్దరు చిన్నారులు ఆదర్శంగా నిలిచారు. మార్కెట్లో దొరికే కృత్రిమ రంగులకు స్వస్తి పలికారు. బీబీనగర్ మం. పరిధిలోని పడమటి సోమారం గ్రామానికి చెందిన సుభిక్షిత్, అభిజ్ఞ అన్నాచెల్లెలు. హోలీ పండగ కోసం తమ గ్రామంలో విరబూసిన మోదుగు పూలను సేకరించారు. స్వయంగా రంగు నీళ్లు సిద్ధం చేశారు. సహజసిద్ధమైన ఈ నీళ్లను చల్లుకుంటూ హోలీ ఆడారు. ఇక మీదటైనా ప్రకృతి నడుమ ‘హోలీ’ జరుపుకుందాం.
Similar News
News March 15, 2025
రాంబిల్లి: అలలకు వ్యక్తి గల్లంతు

రాంబిల్లి మండలం కడపాలెంకి చెందిన మత్స్యకారుడు మెరుగు జగన్(20) చేపలు పడుతుండగా సముద్రపు అలలకు బోటు తిరగబడి గల్లంతయ్యాడు. సీఐ నర్సింగరావు కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం జెడ్.చింతవ సమీపంలో ఐదుగురితో కలిసి చేపలు పడుతుండగా బోటు తిరగబడి జగన్ గల్లంతయ్యాడు. మిగిలిన ఐదుగురు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. కుమారుడు గల్లంతయినట్లు అతని తండ్రి అచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News March 15, 2025
సూర్యాపేటలో రూ.1430 కోట్ల సీఎంఆర్ బకాయిలు

సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే టాప్లో నిలిచింది. సీఎంఆర్ బియ్యం బకాయిలు చెల్లించడంలో 2-3 ఏళ్ల నుంచి మిల్లర్లు జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సొంత జిల్లాలోనే ఈ విధంగా జాప్యం ఉండడం గమనార్హం. సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్య ధోరణితోనే గతంలో ఈ అవినీతికి తెరలేపినట్లు సమాచారం. రూ.100 కోట్ల అవినీతికి తెరలేపిన వారిపైచర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
News March 15, 2025
HYD: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

HYDలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం పగటి ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలుగా నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగినా గాలులు వీస్తుండడంతో ఉక్కపోత ఇంకా మొదలు కాలేదు. రానున్న రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.