News January 10, 2025
NLG: ఈ ఆలయాలకు వెళ్తున్నారా మీరు!

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి NLG జిల్లాల పరిధిలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున రానున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ క్షేత్రాలైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి, సూర్యాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి, నల్గొండ సీతారామచంద్ర స్వామి, పానగల్లు ఛాయా సోమేశ్వర ఆలయాలతో పాటు వాడవాడలో ఉన్న వైష్ణవ ఆలయాల్లో నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News December 22, 2025
నల్గొండ: పశువుల ఆస్పత్రిలోనే పంచాయతీ పాలన!

నిడమనూరు మండలంలోని పలు జీపీలకు సొంత భవనాలు లేక పాలన అద్దె గదుల్లోనే సాగుతోంది. నిడమనూరు మేజర్ పంచాయతీ భవన నిర్మాణం 11 ఏళ్లుగా అసంపూర్తిగానే ఉండటంతో, ప్రస్తుతం పక్కనే ఉన్న పశువుల ఆస్పత్రిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అటు సిబ్బంది, ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నిధులు విడుదల చేసి సొంత భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
News December 22, 2025
NLG: జిల్లాకు నాలుగు ట్రామా కేర్ సెంటర్లు

జిల్లాలో కొత్తగా 4 ఆస్పత్రుల్లో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ సెంటర్ ద్వారా క్షతగాత్రులకు గోల్డెన్ అవర్లో మెరుగైన, తక్షణ చికిత్స అందడంతో ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలోని DVK, MLG, నాగార్జునసాగర్, NKL ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో DVK, MLG ఏరియా ఆసుపత్రుల్లో పనులు ప్రారంభించనున్నారు.
News December 22, 2025
NLG: నేటి నుంచి నట్టల నివారణ మందుల పంపిణీ

జిల్లాలోని గొర్రెలు, మేకలకు ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకు సామూహికంగా నట్టల నివారణ మందు వేయనున్నట్లు జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ జీవీ రమేష్ తెలిపారు. జిల్లాలో మొత్తం 250 మంది సిబ్బంది 78 మంది బృందంగా ఏర్పడి ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. జీవాలకు నట్టల నివారణ మందులు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయన్నారు. జీవాల పెంపకందార్లు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


