News February 19, 2025
NLG: ఊపందుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఊపందుకున్నది. ఈనెల 27న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. కాగా యూటీఎఫ్ తరఫున మరోసారి బరిలోకి దిగిన నర్సిరెడ్డికి వామపక్షాలు మద్దతిస్తున్నాయి.
Similar News
News December 4, 2025
గద్వాల: మొదటి విడత ఎన్నికలు.. 15 జీపీలు ఏకగ్రీవం

గద్వాల నియోజకవర్గంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న 106 గ్రామ పంచాయతీల్లో 15 ఏకగ్రీవాలు అయినట్లు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా గట్టు మండలంలో 6 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, ధరూర్ మండలంలో 4, గద్వాల మండలంలో 3, కేటిదొడ్డి మండలంలో 2 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 91 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
News December 4, 2025
పుతిన్ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారు: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ మధ్య పీస్ ప్లాన్పై నిన్న రష్యాలో అమెరికా ప్రతినిధి బృందం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నారని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘పుతిన్తో జారెడ్ కుష్నెర్, స్టీవ్ విట్కాఫ్ సమావేశం బాగా జరిగింది. అయితే ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నట్లు వారిద్దరూ అభిప్రాయపడ్డారు’ అని అన్నారు.
News December 4, 2025
HYD: DEC 16న అథ్లెటిక్స్ MEET

డిసెంబర్ 16న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో సబ్ జూనియర్, యూత్ అథ్లెటిక్స్ మీట్ 2025 జరగనుంది. ఉ. 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో 4- 20 ఏళ్లలోపు బాలలు, బాలికలు పాల్గొనవచ్చు. స్ప్రింట్, రన్నింగ్, లాంగ్ జంప్ ఉంటాయి. ఆసక్తి గలవారు https://forms.gle/ouD9qXh9QTyAY7R47 రిజిస్టర్ చేసుకోవాలని. మిగతా వివరాలకు 99630 48320, 99590 91114లలో సంప్రదించండి.


