News May 11, 2024

NLG: ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులకు కీలక సూచన

image

MP ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ వారి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నింటినీ తనిఖీ చేయించుకోవాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్ తెలిపారు. శనివారం ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల మూడో విడత తనిఖీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఎవరైనా అభ్యర్థులకు ఖర్చులకు సంబంధించి రిజిస్టర్లు, ఖర్చులు సంబంధించిన వివరాలు మిగిలిపోయినట్లయితే తనిఖీ చేయించుకోవాలన్నారు.

Similar News

News October 15, 2025

పరిశోధనలే సమాజానికి దిక్సూచి: ఎంజీయూ వీసీ

image

విద్యాలయాలలో జరిగే పరిశోధనలే సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తాయని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. 2028లో జరగనున్న మూడో విడత నాక్ మూల్యాంకనంపై ఐక్యూఏసీ ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పరిశోధనల నాణ్యత పెంచాలని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు.

News October 15, 2025

నల్గొండ: బాలికపై అత్యాచారం.. ఏడేళ్ల జైలు శిక్ష

image

నల్గొండలో మైనర్‌పై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉప్పల నాగార్జునకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధించింది. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి తీర్పు చెప్పారు. 2019లో మోతే పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.

News October 15, 2025

NLG: జిల్లాకు కొత్తగా ఎనిమిది మంది ఎంపీడీవోలు

image

జిల్లాకు కొత్తగా 8 మంది ఎంపీడీఓలు రానున్నారు. ఇటీవల గ్రూప్-1 ద్వారా ఎంపికైన వారిలో జిల్లాకు 8 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం కేటాయించింది. అయితే వారిలో ముగ్గురు విధుల్లో చేరి తిరిగి HYDలో శిక్షణకు హాజరుకానున్నారు. మిగతా వారు ఇప్పటికే ఇతర శాఖల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నందున శిక్షణ అనంతరం ఆ శాఖలో రిలీవై ఎంపీడీవోలుగా విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది. వీరి రాకతో జిల్లాలో ఎంపీడీఓల కొరత తీరనుంది.