News May 11, 2024

NLG: ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులకు కీలక సూచన

image

MP ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ వారి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నింటినీ తనిఖీ చేయించుకోవాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్ తెలిపారు. శనివారం ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల మూడో విడత తనిఖీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఎవరైనా అభ్యర్థులకు ఖర్చులకు సంబంధించి రిజిస్టర్లు, ఖర్చులు సంబంధించిన వివరాలు మిగిలిపోయినట్లయితే తనిఖీ చేయించుకోవాలన్నారు.

Similar News

News March 7, 2026

ఇండియన్ టీమ్‌కు గట్టుప్పల్ అమ్మాయి సెలెక్ట్

image

అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు గట్టుప్పల్ మండలానికి చెందిన పగిళ్ళ చందన ఎంపికైంది. భారత్ – థాయ్‌లాండ్ మధ్య జరిగే అంతర్జాతీయ టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. ఈ నెల 11 నుంచి 15 వరకు థాయ్‌లాండ్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. సీనియర్ క్రీడాకారిణిగా చందన అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై స్థానికులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 7, 2026

నల్గొండకు నేడు ముగ్గురు మంత్రుల రాక

image

నల్గొండ కలెక్టరేట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. అభివృద్ధి పనులపై సమీక్షించనున్న ఈ భేటీ కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

News March 6, 2026

NLG: ఇంటర్ పరీక్షలకు 261 మంది గైర్హాజరు

image

జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 261 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 9,796, మంది విద్యార్థులకు గాను 9,620 మంది హాజరుకాగా, 176 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1938 మంది విద్యార్థులకు గాను 1853 మంది హాజరుకాగా, 85 మంది గైర్హాజరయ్యారు.