News February 25, 2025

NLG: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

Similar News

News December 9, 2025

పశుసంపద బలోపేతమే లక్ష్యం: కలెక్టర్

image

పశు సంపద రంగాన్ని బలోపేతం చేయటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ కృత్తికా శుక్ల అన్నారు. గొర్రెల పెంపకందారులను రక్షించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొస్తున్న క్లైమేట్ రెసిలియంట్ ఇంటిగ్రేటెడ్ షీప్ హోస్టెల్స్ (CRISH) ప్రాజెక్టు అమలుపై కలెక్టరేట్‌లో ఆమె మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు అమలును వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News December 9, 2025

VZM: ‘వచ్చే ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి’

image

రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యంగా పెట్టుకున్న 5 లక్షల ఇళ్ల నిర్మాణం పురోగతిని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.అరుణ్ బాబు మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. గొల్లలపేట (PMAY-1.0)లో నిర్మిస్తున్న 106 ఇళ్లను సందర్శించి, లబ్ధిదారుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ ఇళ్లను ఉగాది 2026 నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

News December 9, 2025

అనకాపల్లి: ‘పది, ఇంటర్ పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి’

image

జిల్లాలో ఈ ఏడాది పది, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. అనకాపల్లి కలెక్టరేట్ నుంచి మంగళవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శత శాతం ఉత్తీర్ణత సాధించేందుకు 100 రోజుల కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఇంటికి వెళ్లిన వసతి గృహాలకు చెందిన విద్యార్థులను వెంటనే వెనక్కి తీసుకురావాలన్నారు.