News February 13, 2025
NLG: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. బరిలో ఎక్కువమంది పోటీ పడుతుండడంతో ఎన్నిక రసవత్తరం కానుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
Similar News
News November 18, 2025
నల్గొండ: రూ.15 లక్షల టోకరా: మహిళా సంఘాలు

తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ మహిళా పొదుపు సంఘం సభ్యులు రూ.15 లక్షల మేర మోసపోయామంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. లింగంపల్లి ఆర్పీ ఫీల్డ్ అసిస్టెంట్తో కుమ్మక్కై శ్రీ భవానీ సమభావన సంఘం సభ్యుల ఫొటోలు, ఆధార్ కార్డులు వాడి, సంతకాలు ఫోర్జరీ చేసి సంఘం పేరుపై సుమారు రూ.15 లక్షల రుణం తీసుకున్నట్లు సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై తాము కలెక్టర్కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు.
News November 18, 2025
నల్గొండ: రూ.15 లక్షల టోకరా: మహిళా సంఘాలు

తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ మహిళా పొదుపు సంఘం సభ్యులు రూ.15 లక్షల మేర మోసపోయామంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. లింగంపల్లి ఆర్పీ ఫీల్డ్ అసిస్టెంట్తో కుమ్మక్కై శ్రీ భవానీ సమభావన సంఘం సభ్యుల ఫొటోలు, ఆధార్ కార్డులు వాడి, సంతకాలు ఫోర్జరీ చేసి సంఘం పేరుపై సుమారు రూ.15 లక్షల రుణం తీసుకున్నట్లు సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై తాము కలెక్టర్కు వినతిపత్రం సమర్పించామని తెలిపారు.
News November 17, 2025
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు: ఇలా త్రిపాఠి

నల్గొండ కలెక్టరేట్లో సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు అందాయి. 73 పిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవెన్యూ శాఖకు సంబంధించినవి వచ్చాయి. ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు.


