News February 1, 2025
NLG: ఎల్ఆర్ఎస్కు నో రెస్పాన్స్..!

జిల్లాలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 72,642 మంది రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 732 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వివిధ కారణాలతో 93 దరఖాస్తులను మూసేశారు. 37,814 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 14,702 మంది స్థలాలకు అనుమతి లభించగా.. ఇప్పటివరకు 662 మంది మాత్రమే ఫీజు చెల్లించారు.
Similar News
News February 19, 2025
NLG: ఊపందుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఊపందుకున్నది. ఈనెల 27న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. కాగా యూటీఎఫ్ తరఫున మరోసారి బరిలోకి దిగిన నర్సిరెడ్డికి వామపక్షాలు మద్దతిస్తున్నాయి.
News February 19, 2025
NLG: ఇందిరమ్మ ఇండ్లు సరే.. ఇసుకెట్ల..!?

రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇప్పటికే లబ్థిదారుల ఎంపిక కూడా పూర్తయింది. సొంత స్థలం ఉన్నవారి ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పున జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అయితే.. జిల్లాలో సాగుతున్న ఇసుక దోపిడీతో ఇళ్ల నిర్మాణానికి కూడా దొరికే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News February 19, 2025
శివాజీ జయంతి: హోరెత్తనున్న నల్గొండ

హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ 398వ జయంతి ఉత్సవాలకు నల్గొండ ముస్తాబైంది. పల్లెపల్లెనా, మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున ర్యాలీలు తీసేందుకు ఇప్పటికే ఏర్పాట్లుచేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో శివాజీ మహారాజ్ శోభాయాత్ర ఉంటుందని హిందూవాహినీ సభ్యులు తెలిపారు. రామగిరి రామాలయం నుంచి సాయంత్రం 4 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.