News April 8, 2025
NLG: ఏసీబీ అయితేనేం.. డోంట్ కేర్!

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగులకు <<16034547>>ACB <<>>శాఖ ఒకటి ఉంటుందన్న భయం లేకుండా పోతుంది. పట్టుబడితే శాశ్వతంగా ఉద్యోగం పోదని 4 రోజులు ఆగితే మళ్లీ ఉద్యోగంలోకి రావచ్చనే ధీమా అవినీతి అధికారులు, ఉద్యోగుల్లో పెరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చే జీతం కన్నా ఎక్కువగా లంచాలకు మరిగిన అధికారులు, ఉద్యోగులు ACBని అసలు పట్టించుకోవడం లేదనడానికి ఇటీవల పట్టుబడిన ఘటనలే నిదర్శనంగా చెప్పవచ్చు.
Similar News
News February 24, 2026
NLG: రైస్ మిల్లర్లపై పోలీసు కేసుల కలకలం!

జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగ్గొట్టిన రైస్ మిల్లర్లపై సివిల్ సప్లై అధికారులు కన్నెర్ర చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా అక్రమాలకు పాల్పడిన పలువురు మిల్లర్లపై రెండు రోజుల నుంచి వరుసగా కేసులు నమోదు చేయించడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బియ్యం మాయం చేసినట్లు గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వెనువెంటనే ఎఫ్.ఐ.ఆర్లు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
News February 24, 2026
ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి

ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూ. 1.25 కోట్ల భారీ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయింపు సహా పలు అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపినట్లు వివరించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.
News February 24, 2026
NRPT: విషాదం.. పెళ్లయిన మూడో రోజే వరుడు సూసైడ్

నారాయణపేట జిల్లా నర్వలో విషాదం చోటుచేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాలు.. ఈనెల 20న కర్నూల్ వాసి సంధ్యతో నర్వకు చెందిన రవి(25)కి వివాహం జరిగింది. ఈ క్రమంలో ఈనెల 22న రాత్రి భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వధువు బంధువులు ఇంటికి చేరుకుని వరుడి కుటుంబీకులపై దాడి చేయడంతో మనస్తాపానికి గురైన రవి సోమవారం ఉరేసుకుని చనిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.


