News January 20, 2025
NLG: ఒక్క యాప్తో వివరాలు మీ చేతిలో..
విహారయాత్రలు, దైవదర్శనాల సమాచారం కోసం ప్రభుత్వం మీ టికెట్ యాప్ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి సాగర్ బోటు ప్రయాణానికి సంబంధించిన వివరాలు, బుద్ధవనం, యాదగిరిగుట్ట ఆలయం, మిర్యాలగూడ చెరువులోని బోటింగ్ వివరాలను ఉంచారు. ఇంకా ఉమ్మడి నల్గొండలో ఛాయా సోమేశ్వర ఆలయం, పచ్చలసోమేశ్వరాలయం, వాడపల్లి, మట్టపల్లి, ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు, పిల్లలమర్రి శివాలయం వివరాలను పొందుపరచాల్సి ఉంది.
Similar News
News February 5, 2025
NLG: పరిషత్తు.. కసరత్తు
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. తాజాగా మండల జిల్లా పరిషత్ ఎన్నికలే మొదట నిర్వహిస్తామని చెబుతుండటంతో యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తుంది. జిల్లాలో 33 జడ్పీటీసీలు, 352 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న GP ఓటర్ల జాబితా ఆధారంగా ఎంపీటీసీ ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు.
News February 5, 2025
ఈనెల 7న బుద్ధవనంలో ‘త్రిపీటక పఠనోత్సవం’
నాగార్జునసాగర్ హిల్ కాలనీ బుద్ధవనంలో ఈనెల 7న మహాబోధి సొసైటీ సికింద్రాబాద్, అంతర్జాతీయ త్రిపీటక సంగాయన మండలి ఆధ్వర్యంలో త్రిపీటక పఠనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బౌద్ధ ధార్మిక సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణ కోసం నిర్వహించే కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 200 మంది బౌద్ధ బిక్షువులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
News February 5, 2025
NLG: బీడు భూముల్లో బంగారం పండిస్తున్నాడు
నల్గొండ జిల్లా చందంపేట మండలం అంటేనే బీడు భూములు, కరువు కాటకాలతో కూడిన ప్రాంతం. భూగర్భ జలాలు లేక రైతులు అల్లాడుతుంటారు. ఆ బీడు భూముల్లోనే బంగారం పడిస్తున్నాడు రైతు పద్మారెడ్డి. వినూత్నంగా తన 12ఎకరాల్లో 1991లోనే 1200 కుంకుడు మొక్కలు నాటి ఎకరాకు రూ.5వేల పెట్టుడితో రూ.13లక్షల ఆదాయం పొందుతున్నాడు. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి సాధిస్తూ.. కిలో కుంకుడుకాయలు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నాడు.