News January 7, 2025
NLG: ఓటర్ల లెక్క తేలింది.. ‘ఆమె’దే ఆదిపత్యం!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది. ఓటర్ తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 29,75,286 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులకన్న మహిళా ఓటర్లు 48,797 మంది అధికంగా ఉన్నారు. పురుష ఓటర్లు 14,63,142 మంది ఉండగా, మహిళా ఓటర్లు 15,11,939, ట్రాన్స్ జెండర్లు 2005 మంది ఉన్నారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితాతో పోల్చితే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది.
Similar News
News November 20, 2025
NLG: ఎఫ్సీఐ డివిజనల్ కార్యాలయం ప్రారంభం

నల్గొండ జిల్లాలో నూతనంగా నిర్మించిన ఎఫ్సీఐ డివిజనల్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, FCI ED వనిత శర్మ, MLC శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ధాన్య నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి, పంపిణీని మెరుగుపరచడానికి ఈ కార్యాలయం దోహదపడుతుందని మంత్రులు పేర్కొన్నారు.
News November 20, 2025
NLG: రోడ్లపై ధాన్యం వద్దు.. ప్రమాదాలకు కారణం కావొద్దు: ఎస్పీ

నల్గొండ జిల్లాలో రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టి రోడ్డు ప్రమాదాలకు కారణం కావొద్దని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై ధాన్యం రాశులు, రాళ్లు ఉంచడం వల్ల ముఖ్యంగా రాత్రి సమయాల్లో వాహనదారులకు అవి కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని, ప్రాణ నష్టం జరగకుండా సహకరించాలని ఎస్పీ కోరారు.
News November 20, 2025
NLG: వామ్మో కోతులు

జిల్లాలో కోతుల బెడద కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగుబడులు గణనీయంగా తగ్గడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలాకాలంగా వానరాలతో అటు రైతులు, ఇటు ప్రజలు సతమతమవుతున్నారు. రోజూ వేలాది కోతులు కూరగాయలు, పండ్ల తోటలు, పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తూ రైతులను ఇబ్బందుల్లో పడేస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.


