News July 4, 2024
NLG: కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోని ప్రైవేట్ పాఠశాలలు
NLGలోని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని జర్నలిస్టులు ఆరోపించారు. జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50% రాయితీ ఇవ్వాలని జర్నలిస్ట్ సంఘాలు ఇటీవల కలెక్టర్ను కోరగా.. ఆయన ఆదేశాల మేరకు DEO ఈనెల జూన్ 25న ప్రైవేట్ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశించినా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని జర్నలిస్టులు మండిపడుతున్నారు.
Similar News
News October 12, 2024
హుజూర్నగర్: యాక్సిడెంట్.. యువకుడి మృతి
బైక్ అదుపుతప్పి యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి గరిడేపల్లి మండలం మంగాపురం గ్రామ రోడ్డుపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హుజుర్నగర్ మండలం లింగగిరి గ్రామానికి చెందిన తోకల మహేశ్ స్వగ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయాడు. దీంతో దసరా పండగ వేళ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
News October 12, 2024
NLG: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
News October 12, 2024
నల్గొండ: ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖశాంతులతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.