News October 17, 2024

NLG: కీడు వచ్చిందని ఊరు ఖాళీ

image

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో ఇటీవల వరుసగా మరణాలు సంభవించాయి. అనారోగ్యంతో కొంతమంది, రోడ్డు ప్రమాదంలో మరికొందరు, వయసు మళ్లిన వారు వరుసగా మృత్యువాత పడ్డారు. గ్రామానికి కీడు దాపరించడంతోనే ఈ అనర్థాలు జరుగుతున్నాయని భావించిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కీడు పోవాలంటే సూర్యోదయానికి ముందే పిల్లా పెద్దలతో సహా ఊరంతా ఖాళీ చేసి సూర్యాస్తమయం వరకు బయట ఉండాలని నిర్ణయించారు.

Similar News

News October 19, 2025

NLG: జిల్లాలో ఇక భూ సర్వేలు చకచకా!

image

ఇక భూ సర్వేలు చకచకా కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 17 మంది ప్రభుత్వ సర్వేయర్లు, ముగ్గురు డిప్యూటీ సర్వేయర్లు, ఆరుగురు కమ్యూనిటీ సర్వేయర్లు మొత్తం 26 మంది మాత్రమే ఉన్నారు. లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకంతో సర్వేయర్ల కొరత తీరనుంది. ఇప్పటికే లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో తొలి విడత శిక్షణకు ఎంపికైన లిస్టును తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసింది.

News October 19, 2025

నల్గొండ: 23 వరకు గడువు.. 27న డ్రా

image

నల్గొండ జిల్లాలో 154 వైన్స్‌లకు 4,619 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న ఏకంగా 2, 180 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షలు చొప్పున రూ. 138.57 కోట్లు ఆదాయం సమకూరింది. గత పాలసీలో 155 వైన్స్‌లకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున రూ. 141.14 కోట్ల ఆదాయం లభిచింది. 23 వరకు గడువు పొడిగించడంతో దరఖాస్తులు పెరిగే అవకాశముంది. 27డ్రా తీయనున్నారు.

News October 19, 2025

NLG: ల్యాప్‌టాప్, నగదు మిస్సింగ్.. నిజాయితీ రూపంలో తిరిగొచ్చాయి

image

నల్గొండ నుంచి మిర్యాలగూడకు ప్రయాణిస్తున్న నెమ్మాని సంధ్య ఆటోలో తన ల్యాప్‌టాప్‌తో పాటు రూ.1500 నగదు మరిచిపోయారు. అయితే ఆటో డ్రైవర్ ఎండీ లతీఫ్ వాటిని నల్గొండ టూ టౌన్ పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. ఎస్సై వై. సైదులు విచారణ జరిపి ల్యాప్‌టాప్, నగదును సదరు మహిళకు అందజేశారు. లతీఫ్ నిజాయితీని ఎస్సై అభినందించారు. ఈ మంచితనం ఆదర్శనీయమని ఎస్సై పేర్కొన్నారు.