News February 24, 2025

NLG: క్విజ్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే!

image

☞‘జల సాధన సమితి’ <<15559618>>వ్యవస్థాపకుడు <<>>ఎవరు? – దుశర్ల సత్యనారాయణ
☞నాగార్జున సాగర్ ఎడమ కాలువని ఏమంటారు? – లాల్ బహదూర్ కాలువ
☞‘బండెనక బండి కట్టి’ గేయ రచయిత ఎవరు? – బండి యాదగిరి
☞‘ప్రజల మనిషి’ నవలను ఎవరు రచించారు? – వట్టి కోట ఆళ్వారుస్వామి
☞భువనగిరి కోటను ఎవరు నిర్మించారు? – త్రిభువన మల్ల విక్రమాదిత్య(6)
SHARE IT..

Similar News

News October 22, 2025

రానున్న 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు!

image

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వల్ల రేపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి 35-55km/h వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం వరకు జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

News October 22, 2025

మేడారంలో 1050 ఎకరాల్లో 49 పార్కింగ్ స్థలాలు

image

మేడారం మహా జాతర సమయంలో లక్షల సంఖ్యలో తరలి వచ్చే భక్తులు వాహనాలను నిలిపేందుకు అధికార యంత్రాంగం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన మేడారం జాతర సమీక్షలో కలెక్టర్ దివాకర వివరాలను వెల్లడించారు. 1050 ఎకరాల్లో 49 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిలో 4.5లక్షల నుంచి 6లక్షల వాహనాలు ఏకకాలంలో నిలిపే అవకాశం ఉందన్నారు. 33 అటవీ మార్గాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

News October 22, 2025

మైలవరంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

మైలవరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి గొర్రె అరవింద్(22) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం(M) దేవరపల్లికి చెందిన అరవింద్ మైలవరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. బెట్టింగ్‌లో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.