News February 25, 2025
NLG: క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా?

☞ఎవరికాలంలో నల్గొండ నీలగిరిగా ప్రసిద్ధి చెందింది?
☞భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
☞దేశోద్ధారక గ్రంథమాలను ఎవరు స్థాపించారు?
☞రావి నారాయణరెడ్డి జన్మస్థలం?
☞‘పల్లెటూరి పిల్లగాడ’ పాటను ఎవరు రచించారు?
★పై ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ చేయగలరు?
నోట్: మధ్యాహ్నం 2 గంటలకు ఇదే ఆర్టికల్లో జవాబులను చూడొచ్చు.
SHARE IT..
Similar News
News February 25, 2025
మహాశివరాత్రి.. మల్లన్న బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు: CP

శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మహాశివరాత్రి, పెద్దపట్నం, సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న శివాలయాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, 26న మహాశివరాత్రి పెద్దపట్నం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
News February 25, 2025
భూపాలపల్లి: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి సన్మానం

భూపాలపల్లి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవిని ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా, ఏఐఎంసీ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జి కమలాక్షి మంగళవారం శాలువాతో సన్మానించారు. ఆల్కాలాంబ మాట్లాడుతూ.. దేశంలోనే లక్షకుపైగా మహిళా సభ్యత్వాలు నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మహిళా కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.
News February 25, 2025
గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలు నిలిపివేత

ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రామం నుంచి రిజర్వు ఫారెస్ట్లో గల గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలను అర్ధాంతరంగా నిలిపివేసినట్లు తహశీల్దార్ శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు తొక్కిసలాటలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దారి తప్పిన ఏనుగుల గుంపు ప్రమాదం కలుగజేస్తాయని ముందు జాగ్రత్తగా ఉత్సవాలను నిలిపివేసినట్లు తెలిపారు.