News April 18, 2024
NLG: గురుకులాలను పట్టించుకోని అధికారులు

నల్గొండ జిల్లా పరిధిలో 28గురుకులాలు, 5 డిగ్రీ కళాశాలలు పనిచేస్తున్నాయి. ఆయా పాఠశాలలు, కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సిబ్బంది సమన్వయలోపం, నిర్లక్ష్యంతోనే భువనగిరి గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా విచారణలో తేలడంతో ప్రిన్సిపల్ శ్రీరాముల శ్రీనివాస్ను సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి సస్పెండ్ చేయడంపై ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.
Similar News
News November 12, 2025
NLG: ధాన్యం సేకరణపై కలెక్టర్ మార్గదర్శం

నవంబర్, డిసెంబర్ తొలి వారంలో పెద్దఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున, కొనుగోలు ప్రక్రియలో పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ ఇల్లా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆమె సంబంధిత శాఖల అధికారులు, తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులకు ఈ మేరకు స్పష్టమైన సూచనలు చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు.
News November 12, 2025
NLG: సన్నబియ్యంలో నూకలే అధికం: లబ్ధిదారులు

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా ఉంటున్నాయని జిల్లాలోని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గత 2 నెలల నుంచి పంపిణీ చేస్తున్న బియ్యంలో 20% పైగా నూకలు ఉంటున్నాయని వారు తెలిపారు. జిల్లాలో మొత్తం 4,66,100 రేషన్ కార్డులు ఉండగా, ప్రతినెలా జిల్లా వ్యాప్తంగా 94.04 లక్షల క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. మీకు కూడా ఇదే సమస్య పునరావృతం అవుతుందా? కామెంట్.
News November 11, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

→ NLG: 13 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు
→ NLG: వే2న్యూస్ కథనానికి అధికారుల స్పందన
→ కేతేపల్లి: నార్కోటిక్స్ కట్టడిలో నల్గొండ పోలీస్ సంచలనం
→ NLG: వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
→ NLG: 4 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు
→ NLG: 50 శాతం సిలబస్ ఇంకా అలానే..
→ NLG: పంట పండింది.. సేకరణ ఇలా
→ MLG: రబ్బరులా ఇడ్లీ రవ్వ
→చిట్యాల : బస్సు దగ్ధం.. ప్రయాణికుల రియాక్షన్


