News January 22, 2025

NLG: గురుకుల ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జ్యోతిబా పులే బాపులే గురుకుల పాఠశాలలలో 5వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి ఈ. స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ఉమ్మడి సొసైటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వెబ్ సైట్ http://www.mjptbcwreis.telangana.gov.in/లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News September 15, 2025

మరో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హతం

image

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది. మిగతా ఇద్దరు చంచల్, జహల్‌పై తలో రూ.50 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ కూడా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,11,060కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.1,01,800 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.100 తగ్గి రూ.1,42,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 15, 2025

హిమాయత్‌సాగర్‌కు తగ్గిన వరద ఉద్ధృతి

image

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉద్ధృతి తగ్గడంతో జలాశయం ఒక ట్రస్ట్ గేటు 3 ఫీట్ల మేర ఎత్తి 990 క్యూసెక్కుల నీరు ఈసీ నదిలోకి వదిలారు. వరద తగ్గడంతో హిమాయత్‌సాగర్ నుంచి రాజేంద్రనగర్ వెళ్లే ఔటర్ సబ్ రోడ్డుపై రాకపోకలను పునరుద్ధరించారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1762.15 అడుగులుగా ఉంది.