News July 5, 2024
NLG: జిల్లాలో జలశక్తి అభియాన్ పనులు భేష్

నల్గొండ జిల్లాలో జలశక్తి అభియాన్ పనులు బాగుండడం పట్ల కేంద్ర జల శక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ వేద వీర్ ఆర్య సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పనుల పరిశీలన నిమిత్తం మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ బృందం శాస్త్రవేత్త దివాకర్ మహంతాతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సి. నారాయణరెడ్డితో సమావేశమయ్యారు.
Similar News
News November 18, 2025
NLG: యాసంగికి ఢోకా లేదు..!

శాలిగౌరారం ప్రాజెక్టులో ప్రస్తుతం యాసంగి సీజన్కు నీటి నిలువలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. సాధారణంగా వానాకాలం పంటకు సాగునీటి సమస్యలు లేకున్నా యాసంగి పంటకు సరిపడా సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. కానీ గత నెలలో కురిసిన భారీ వర్షాలు తుఫాన్ల వల్ల ఎగువ నుంచి భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
News November 18, 2025
NLG: యాసంగికి ఢోకా లేదు..!

శాలిగౌరారం ప్రాజెక్టులో ప్రస్తుతం యాసంగి సీజన్కు నీటి నిలువలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. సాధారణంగా వానాకాలం పంటకు సాగునీటి సమస్యలు లేకున్నా యాసంగి పంటకు సరిపడా సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. కానీ గత నెలలో కురిసిన భారీ వర్షాలు తుఫాన్ల వల్ల ఎగువ నుంచి భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
News November 18, 2025
నేడు జలశక్తి మిషన్ అవార్డు ప్రదానం

జల్ సంచయ్ జన్ భాగీదారీ పథకం కింద నల్గొండ జిల్లా అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డును కేంద్ర జలశక్తి మిషన్ ఈనెల 18న ఢిల్లీలో ఇవ్వనుంది. జిల్లాకు రూ.2 కోట్ల ప్రోత్సాహకం అందజేయనుంది. జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు 84,827 పనులను చేపట్టినందుకు గాను ఈ అవార్డును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయనున్నారు. అవార్డును అందుకునేందుకు జిల్లా డీఆర్డీఏ అధికారులు ఢిల్లీకి వెళ్లారు.


