News July 5, 2024

NLG: జిల్లాలో జలశక్తి అభియాన్ పనులు భేష్

image

నల్గొండ జిల్లాలో జలశక్తి అభియాన్ పనులు బాగుండడం పట్ల కేంద్ర జల శక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ వేద వీర్ ఆర్య సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పనుల పరిశీలన నిమిత్తం మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ బృందం శాస్త్రవేత్త దివాకర్ మహంతాతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సి. నారాయణరెడ్డితో సమావేశమయ్యారు.

Similar News

News October 13, 2025

ఇసుక తవ్వకాలపై నివేదిక కోరిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

జిల్లాలోని ఇసుక తవ్వకాలకు సంబంధించి కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను నివేదిక కోరారు. నీటిపారుదల, గనులు, భూగర్భ జల వనరులు, టీఎస్ ఎంఐడీసీ, అటవీ, రెవెన్యూ, ముఖ్య ప్రణాళిక అధికారి శాఖల నుంచి ఇసుక తవ్వకాలపై నివేదికలను అందించాలని ఆదేశించారు. ఆయా శాఖలు సమర్పించిన నివేదికలన్నింటిని పూర్తిస్థాయి జిల్లా సమగ్ర నివేదికగా మార్చి అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

News October 13, 2025

ఎస్పీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌ డే.. 35 ఫిర్యాదులు స్వీకరణ

image

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతీ సోమవారం నిర్వహించే పోలీస్‌ గ్రీవెన్స్‌ డే కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో విజయవంతంగా ముగిసింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ దాదాపు 35 మంది అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను చేరువ చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ తెలిపారు.

News October 13, 2025

నల్గొండ: ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి

image

చిట్యాలకు చెందిన బోరు బండి యజమాని ఒడిశాలో ఏనుగుల దాడిలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రారపు సైదులు దసరాకు ఇంటికి వచ్చాడు. బోరు పనుల కోసం శనివారం ఒడిశాలోని దేన్ కనాల్ జిల్లాలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడికి ఒక్కసారిగా వచ్చిన ఏనుగుల గుంపు దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం మృతదేహన్ని చిట్యాలకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.