News February 14, 2025
NLG: జేఈఈలో నేహలతకు 93.22 పర్సంటైల్

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేటకు చెందిన బైరోజు బ్రహ్మచారి-కల్యాణి దంపతుల కుమార్తె నేహలత ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 93.22 పర్సంటైల్ సాధించింది. నేహలత గౌలిదొడ్డిలొని సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్సీ డీడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, గురుకుల కార్యదర్శి వర్షిణి, ప్రిన్సిపల్ కల్పన అభినందించారు.
Similar News
News November 18, 2025
NLG: ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఏం తింటారు!

2026 జనగణన నేపథ్యంలో తిప్పర్తి మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. మండలంలోని మామిడాల, ఇండ్లూరు, సర్వారం, తిప్పర్తి, జంగారెడ్డిగూడెంలలో జనగణన సర్వే చేస్తున్నారు. ఇంటి యజమాని పేరు, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? రైస్ తింటారా లేదంటే గోధుమలు, జొన్నలతో చేసిన రొట్టెలు తింటారా? ఉండేది పెంకుటిల్లా? వంటి వివరాలు అడిగి వెంట వెంటనే యాప్లో నమోదు చేస్తున్నారు.
News November 18, 2025
NLG: ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఏం తింటారు!

2026 జనగణన నేపథ్యంలో తిప్పర్తి మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. మండలంలోని మామిడాల, ఇండ్లూరు, సర్వారం, తిప్పర్తి, జంగారెడ్డిగూడెంలలో జనగణన సర్వే చేస్తున్నారు. ఇంటి యజమాని పేరు, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? రైస్ తింటారా లేదంటే గోధుమలు, జొన్నలతో చేసిన రొట్టెలు తింటారా? ఉండేది పెంకుటిల్లా? వంటి వివరాలు అడిగి వెంట వెంటనే యాప్లో నమోదు చేస్తున్నారు.
News November 18, 2025
NLG: యాసంగికి ఢోకా లేదు..!

శాలిగౌరారం ప్రాజెక్టులో ప్రస్తుతం యాసంగి సీజన్కు నీటి నిలువలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. సాధారణంగా వానాకాలం పంటకు సాగునీటి సమస్యలు లేకున్నా యాసంగి పంటకు సరిపడా సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. కానీ గత నెలలో కురిసిన భారీ వర్షాలు తుఫాన్ల వల్ల ఎగువ నుంచి భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది.


