News February 14, 2025
NLG: జేఈఈలో నేహలతకు 93.22 పర్సంటైల్

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేటకు చెందిన బైరోజు బ్రహ్మచారి-కల్యాణి దంపతుల కుమార్తె నేహలత ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 93.22 పర్సంటైల్ సాధించింది. నేహలత గౌలిదొడ్డిలొని సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్సీ డీడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, గురుకుల కార్యదర్శి వర్షిణి, ప్రిన్సిపల్ కల్పన అభినందించారు.
Similar News
News March 23, 2025
NLG: మహిళా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

మహిళా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను మహిళా రైతులకు రాయితీపై అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 13 రకాల యాంత్రీకరణ పరికరాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం జిల్లాకు కోటి 81 లక్షల 36 వేల నిధులను కేటాయించడంతో పాటు 820 వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే మహిళల లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు.
News March 23, 2025
NLG: సైనిక దళంలో ఉద్యోగాలకు దరఖాస్తులు

భారత సైనిక దళంలో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ పథకం కింద జనరల్, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్ని కల్, ట్రేడ్స్ మెన్గా చేరవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల పురుష అభ్యర్థులు పూర్తి వివరాలను www.joi nindianarmy.nic.in వెబ్ సైట్లో చూసుకోవచ్చని ఆమె తెలిపారు.
News March 23, 2025
NLG: ఇంటిగ్రేటెడ్ IPC కోర్స్తో ఉజ్వల భవిష్యత్తు: VC

ఇంటిగ్రేటెడ్ ఐపీసీ కోర్స్తో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎంజీయూ వైస్ ఛాన్స్లర్ అల్తాన్ హుసేన్ అన్నారు. రీసెర్చ్ అడ్వాన్స్ ఇన్ ఫార్మాటికల్ సెమినార్లో భాగంగా ఎంఎస్సీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ IPC కోర్సుకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కోర్సు పూర్తి చేసిన పూర్వ విద్యార్థులందరూ ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీల అధిపతులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.