News March 29, 2024
NLG: టెట్పై గురి.. అర్హత సాధించేందుకు..

ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష పై యువత గురి పెట్టింది. ఉమ్మడి జిల్లాలోని డీఎడ్, బీఎడ్ అభ్యసించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణత సాధించేందుకు వేలాదిమంది నిరుద్యోగులు ప్రయత్నిస్తున్నారు. గత సెప్టెంబర్లో నిర్వహించిన టెట్ పరీక్షకు మొత్తం 43,681 మంది దరఖాస్తు చేసుకోగా.. 36, l919 మంది హాజరయ్యారు. అందులో పేపర్-1 కు 18,174 మంది, పేపర్-2కు 18,745 మంది టెట్ పరీక్ష రాశారు.
Similar News
News November 26, 2025
NLG: సర్పంచ్ ఎన్నికలలో వారిని దింపేందుకు ఫోకస్..!

ఎన్నికల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడడంతో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP దృష్టి సారించాయి. ఆర్థికంగా బలంగా ఉన్న వారితోపాటు, పలుకుబడి ఉన్న వారిని గుర్తించి మద్దతు ఇచ్చే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. జిల్లాలో మొదటి విడతలో 318, 2వ విడతలో 282, 3వ విడతలో 269 జీపీలకు పోలింగ్ జరగనుంది.
News November 26, 2025
మునుగోడు: పత్తి మిల్లులో అనుమానాస్పదంగా కార్మికుడు మృతి

మునుగోడు మండలం కొంపల్లిలోని జై బిందు పత్తి కొనుగోలు కేంద్రంలో మహారాష్ట్రకు చెందిన కార్మికుడు ముస్తఫా జాఫర్ సాఫ్ జలాలు (30) మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. తహశీల్దార్ నరేష్, చండూరు సీఐ ఆదిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనుమానం ఉన్న శార్దూల్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు.
News November 26, 2025
నల్గొండ: చనిపోతూ ముగ్గురికి లైఫ్ ఇచ్చారు

చండూరుకు చెందిన రైతు పాలకూరి రామస్వామి (75) బైక్ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆయన కుటుంబ సభ్యుల అంగీకారంతో మూడు నిండు జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవయవదానం చేశారు. మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ కుటుంబ సభ్యులకు వీసీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. అవయవదానం-మహాదానం అని ఆయన పేర్కొన్నారు.


