News April 4, 2024

NLG: టెన్త్ మూల్యాంకనం షురూ.. వారికి షోకాజ్ నోటీస్

image

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం ప్రారంభమైంది. NLGలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఈ ప్రక్రియ చేపట్టారు. మూల్యాంకనం కోసం 92 మంది చీఫ్ ఎగ్జామినర్లను నియమించగా.. 72 మంది రిపోర్టు చేశారు. 551 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లకు గాను 452 మంది, 184 మంది స్పెషల్ అసిస్టెంట్లకు గాను 142 మంది రిపోర్టు చేసి మూల్యాంకనంలో పాల్గొన్నారు. మూల్యాంకనానికి హాజరు కాని వారికి డీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Similar News

News October 15, 2025

నల్గొండ: బాలికపై అత్యాచారం.. ఏడేళ్ల జైలు శిక్ష

image

నల్గొండలో మైనర్‌పై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉప్పల నాగార్జునకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధించింది. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి తీర్పు చెప్పారు. 2019లో మోతే పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.

News October 15, 2025

NLG: జిల్లాకు కొత్తగా ఎనిమిది మంది ఎంపీడీవోలు

image

జిల్లాకు కొత్తగా 8 మంది ఎంపీడీఓలు రానున్నారు. ఇటీవల గ్రూప్-1 ద్వారా ఎంపికైన వారిలో జిల్లాకు 8 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం కేటాయించింది. అయితే వారిలో ముగ్గురు విధుల్లో చేరి తిరిగి HYDలో శిక్షణకు హాజరుకానున్నారు. మిగతా వారు ఇప్పటికే ఇతర శాఖల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నందున శిక్షణ అనంతరం ఆ శాఖలో రిలీవై ఎంపీడీవోలుగా విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది. వీరి రాకతో జిల్లాలో ఎంపీడీఓల కొరత తీరనుంది.

News October 15, 2025

NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మల్లన్న గుట్ట వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. మ్యాచింగ్ అయిన ధాన్యాన్ని వచ్చినట్లుగానే కొనుగోలు చేయాలని ఆమె ఆదేశించారు. రైతుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పీఏసీఎస్ సీఈవో బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.