News April 4, 2024
NLG: టెన్త్ మూల్యాంకనం షురూ.. వారికి షోకాజ్ నోటీస్

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం ప్రారంభమైంది. NLGలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఈ ప్రక్రియ చేపట్టారు. మూల్యాంకనం కోసం 92 మంది చీఫ్ ఎగ్జామినర్లను నియమించగా.. 72 మంది రిపోర్టు చేశారు. 551 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లకు గాను 452 మంది, 184 మంది స్పెషల్ అసిస్టెంట్లకు గాను 142 మంది రిపోర్టు చేసి మూల్యాంకనంలో పాల్గొన్నారు. మూల్యాంకనానికి హాజరు కాని వారికి డీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Similar News
News January 4, 2026
NLG: కానరాని కొత్త ఆవిష్కరణలు..!

NLG జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కేవలం తూతూ మంత్రంగా సాగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 2, 3 తేదీల్లో డైట్ కాలేజీలో జరిగిన ఈ వేడుకలో కొత్త ఆవిష్కరణల కంటే పాత ప్రాజెక్టులే ఎక్కువగా కనిపించాయని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యమిచ్చారని, విద్యార్థులను కొత్త ప్రయోగాలు చేసేలా ప్రోత్సహించడంలో విఫలమయ్యారని విద్యావేత్తలు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News January 4, 2026
నల్గొండ: హెల్మెట్ లేకుంటే నో పెట్రోల్

రహదారి భద్రతే ధ్యేయంగా జిల్లా పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా <<18756458>>‘నో హెల్మెట్-నో పెట్రోల్’<<>> విధానాన్ని తెరపైకి తెచ్చారు. హెల్మెట్ లేనిదే బంకుల్లో పెట్రోల్ పోయవద్దని పోస్టర్ల ద్వారా ప్రచారం చేపట్టారు. అతివేగం, అజాగ్రత్తతో ప్రాణాలు కోల్పోకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే బంక్ యజమానులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
News January 4, 2026
నల్గొండ: హెల్మెట్ లేకుంటే నో పెట్రోల్

రహదారి భద్రతే ధ్యేయంగా జిల్లా పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా <<18756458>>‘నో హెల్మెట్-నో పెట్రోల్’<<>> విధానాన్ని తెరపైకి తెచ్చారు. హెల్మెట్ లేనిదే బంకుల్లో పెట్రోల్ పోయవద్దని పోస్టర్ల ద్వారా ప్రచారం చేపట్టారు. అతివేగం, అజాగ్రత్తతో ప్రాణాలు కోల్పోకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే బంక్ యజమానులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.


