News March 5, 2025
NLG: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందన.!

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. కుల గణన అంశంలో తన పాత్రలేదని, గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం తనదన్నారు. తీన్మార్ మల్లన్న ఏ ప్రెస్ మీట్స్ పెట్టుకుంటే.. తనకేంటని జానారెడ్డి పేర్కొన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, సలహాలు అడిగితే ఇస్తానన్నారు. కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు.
Similar News
News December 3, 2025
WGL: రెబల్స్ను బుజ్జగింపులు.. వేడెక్కిన రాజకీయాలు!

జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి పెరిగింది. నేడు నామినేషన్ల ఉపసంహరణ కాగా, పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్స్ కూడా నామినేషన్లు వేయడంతో పలు గ్రామాల్లో గట్టి పోటీ నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతలు రెబల్స్ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈసారి తప్పుకో భవిష్యత్తులో అవకాశం ఇస్తాం అంటూ ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో స్వతంత్రులు బలంగా ఉండటం రాజకీయ సమీకరణాలను మార్చుతోంది.
News December 3, 2025
జిల్లా కేంద్రంగా రాజంపేట.. అర్హతలు ఇవే: JAC

రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి ఉన్న అర్హతలను JAC వివరించింది.
☛ 18 ఎకరాల విస్తీర్ణంలో సబ్ కలెక్టరేట్
☛ రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడిన నాటినుంచి పార్లమెంట్ కేంద్రం
☛ వివిధ నగరాలకు రైళ్ల సదుపాయం
☛ కృష్ణపట్నం ఓడరేవుకు కనెక్టివిటీ
☛ కడప, రేణిగుంట ఎయిర్పోర్టుకు సమీపం
☛ చెయ్యేరు, పెన్నా నదులు ప్రవహించడం
<<18453435>>CONTINUE..<<>>
News December 3, 2025
WGL: నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ దశలో 564 జీపీలు, 4,896 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు ఈ నెల 5 వరకు అవకాశం ఉంది. స్క్రూటినీ 6న పూర్తి చేసి, ఉపసంహరణకు డిసెంబర్ 9 మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. పోలింగ్ ఈ నెల 17న జరగనుంది.


