News March 5, 2025
NLG: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందన.!

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. కుల గణన అంశంలో తన పాత్రలేదని, గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం తనదన్నారు. తీన్మార్ మల్లన్న ఏ ప్రెస్ మీట్స్ పెట్టుకుంటే.. తనకేంటని జానారెడ్డి పేర్కొన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, సలహాలు అడిగితే ఇస్తానన్నారు. కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు.
Similar News
News December 15, 2025
సిరిసిల్ల: ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. జిల్లాలో అక్రమ మద్యంపై నిఘా ఉంచి 98 కేసులలో 1525 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. అలాగే ఎన్నికల ఉల్లంఘనలపై 11 కేసులు నమోదు చేసి రూ.23,28,500 సీజ్ చేశామని వివరించారు. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన 782 మందిని బైండోవర్ చేసామన్నారు.
News December 15, 2025
ప్రియాంకకు AICC పగ్గాలు!

వరుస ఓటములతో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ప్రియాంక గాంధీకి AICC అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. నాయకత్వ మార్పుపై పలువురు నేతలు ఇప్పటికే SONIAకు లేఖలూ రాశారు. ఖర్గే అనారోగ్య కారణాలతో ఈ డిమాండ్ పెరిగింది. ఇందిర రూపురేఖలతో పాటు ఇటీవలి కాలంలో క్రియాశీలకంగా ఉన్న ప్రియాంక రాకతో INCకి పునర్వైభవం వస్తుందని వారు భావిస్తున్నారు.
News December 15, 2025
బాపట్ల: ‘చనిపోయినా ఆమె కళ్లు బతికే ఉంటాయి’

ఇంకొల్లులోని పెద్దనక్కలపాలేనికి చెందిన ఏలూరి సీతారావమ్మ వృద్ధాప్యరీత్యా అనారోగ్యంతో చనిపోయింది. కుటుంబ సభ్యులు ఆమె కళ్లను దానం చేశారు. సోమవారం శంకర్ నేత్ర వైద్యశాల వైద్యులు కార్నియా సేకరించారు. భర్త కృష్ణమూర్తి, కుమారులు హరిబాబు, రఘుబాబును రోటరీ పాలకవర్గం, అవయవదాన కమిటీ అభినందించింది.


