News March 5, 2025

NLG: తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందన.!

image

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. కుల గణన అంశంలో తన పాత్రలేదని, గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం తనదన్నారు. తీన్మార్ మల్లన్న ఏ ప్రెస్ మీట్స్ పెట్టుకుంటే.. తనకేంటని జానారెడ్డి పేర్కొన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, సలహాలు అడిగితే ఇస్తానన్నారు. కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

Similar News

News November 26, 2025

400 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

RITES 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నేటి నుంచి DEC 25వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.600, SC, ST, PwBD, EWS వారికి రూ.300. వెబ్‌సైట్: https://rites.com *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 26, 2025

కామారెడ్డి జిల్లాలో రేపు కవిత పర్యటన

image

TG జాగృతి చీఫ్ కవిత రేపు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్, నిజాంసాగర్ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. బాన్సువాడలో సోషల్ వెల్ఫేర్ జూ.కళాశాలను సందర్శించి, నాగిరెడ్డిపేటలో ముంపు రైతులతో సమావేశం కానున్నారు. నాగన్న బావి, శబరిమాత ఆశ్రమాన్ని సందర్శిస్తారు. కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి నివాళులర్పించి, రైలు ప్రమాదంలో చనిపోయిన సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

News November 26, 2025

అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలి: ఎస్పీ

image

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. పౌర హక్కులు, కర్తవ్యాలు, రాజ్యాంగం విలువలు తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.