News November 9, 2024
NLG: నగల కోసం వృద్ధురాలి హత్య

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం మంగాపురంలో దారుణం జరిగింది. నగల కోసం వృద్ధురాలిని దుండగులు హత్య చేశారు. లక్ష్మమ్మను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఒంటిపై ఉన్న నగలు దోచుకెళ్లారని ఆమె కొడుకు వేములపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. పోస్టుమార్టం కోసం లక్ష్మమ్మ మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 14, 2025
NLG: ఏసీబీ జాన్తా నై.. మేమింతే..!

జిల్లాలో కొంతమంది అధికారులు బరితెగిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ ఒకటి ఉందని తెలిసినా.. భయం లేకుండా అవినీతికి పాల్పడుతున్న ఘటనలు జిల్లా ప్రజలను ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి. ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారులుగా మారుతుండడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 12 మందికి పైగానే ఏసీబీకి పట్టుబడ్డా.. అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు.
News October 14, 2025
NLG: ఎక్సైజ్ టెన్షన్.. మరో ఐదు రోజులే!

జిల్లాలో 2025-27 సంవత్సరానికిగాను వైన్ షాపుల టెండర్లు వేయడానకి ఎవరూ ఆసక్తి చూపట్లేదు. దరఖాస్తు గడువు నేటితో మరో ఐదు రోజులే ఉంది. ఆబ్కారీశాఖ గత నెల 26న జిల్లాలోని 154 దుకాణాలకు టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 18న సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగియనుంది. నోటిఫికేషన్ ఇచ్చి సుమారు 19 రోజులు గడిచినా.. సోమవారం నాటికి దాఖలైన దరఖాస్తుల సంఖ్య 200లు కూడా దాటలేదని సమాచారం.
News October 14, 2025
NLG: వాతవరణం.. వరి పంటకు ప్రతికూలం

ఈ ఏడాది వర్షాలు రైతుల వెన్ను విరుస్తున్నాయి. జిల్లాలో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం కంకి వెళ్లే దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో పొట్టదశలో, మరికొన్ని చోట్ల కంకి వెళ్లి గింజపోసుకునే దశలో ఉన్నాయి. అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రతికూలంగా మారాయి. వరిపొట్టలోకి నీరు చేరడంతో చీడపీడలు ఎక్కువవుతున్నాయి. కంకి వెళ్లిన పంటలో సుంకు రాలిపోతోంది. కంకి వెళ్లి గింజపోసుకుంటున్న వరి వానలకు నేలవాలుతోంది.