News November 9, 2024

NLG: నగల కోసం వృద్ధురాలి హత్య 

image

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం మంగాపురంలో దారుణం జరిగింది. నగల కోసం వృద్ధురాలిని దుండగులు హత్య చేశారు. లక్ష్మమ్మను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఒంటిపై ఉన్న నగలు దోచుకెళ్లారని ఆమె కొడుకు వేములపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. పోస్టుమార్టం కోసం లక్ష్మమ్మ మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News October 31, 2025

NLG: రూ.కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు

image

బకాయిల వసూళ్ల విషయంలో నల్గొండ మున్సిపల్ రెవెన్యూ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రూ.కోట్లలో రావాల్సి ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా పనిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో ఈ ఏడాది ఆస్తి పన్ను రూ.9.30 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇకపోతే పాత బకాయిలు రూ. 33.80 కోట్లు ఉన్నాయి. మొత్తంగా రూ.43.11 కోట్లు ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి.

News October 31, 2025

NLG: ఆ నిబంధనలు.. రైతులతో పరిహాసమే!

image

అటు ప్రకృతి.. ఇటు పాలకులు రైతులకు కన్నీరు తెప్పిస్తున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీగానే పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నేలవాలడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. 33 శాతానికి పైగా దెబ్బతింటేనే పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందే సూచనలు కనిపించడం లేదు. జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 61,511 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.

News October 31, 2025

NLG: 61, 511 ఎకరాల్లో పంట నష్టం

image

‘మొంథా’ జిల్లాలో రైతులను నిలువునా ముంచింది. వర్షం కారణంగా వరి, పత్తి, మిర్చి పంటలు, రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. 310 గ్రామాల్లో 30,359 మంది రైతులకు చెందిన 61,511 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రభుత్వం 33 శాతం పైబడి పంట నష్టపోయిన వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలకు తీరని నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.