News October 25, 2024

NLG: నవంబర్ 4న బీసీ కమిషన్ బృందం రాక: జిల్లా కలెక్టర్

image

నవంబర్ 4వ తేదీన బీసీ కమిషన్ బృందం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ కమిషన్ బృందం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని కులాల (SC, ST, BC, మైనార్టీ) సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషణ చేస్తారని పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరుగుతుందన్నారు.

Similar News

News October 22, 2025

నల్గొండ: ఉపాధి పనుల గుర్తింపునకు కసరత్తు

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నెల మొదటి వారం నుంచే గ్రామసభల ద్వారా పనులను గుర్తించాల్సి ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ఆలస్యం ఏర్పడింది. ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో వీటి నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఉపాధి పనుల గుర్తింపునకు ఈ గ్రామసభలను నిర్వహిస్తున్నారు.

News October 22, 2025

NLG: గడువు పెంచినా.. కానరాని జోరు!

image

నల్గొండ జిల్లాలో ఉన్న 154 ఏ4 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్లలో వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ టెండర్ల స్వీకరణ గడువు పొడిగించారు. కానీ ఆశావాహుల నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా కేవలం 9 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండేళ్ల కిందట ఉన్న ఆసక్తి ప్రస్తుతం మద్యం వ్యాపారుల్లో కనిపించడం లేదని స్పష్టం అవుతుంది.

News October 22, 2025

ధర్వేశిపురంలో ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు.. భక్తుల రద్దీ

image

కనగల్ మండలం ధర్వేశిపురంలో వెలసిన స్వయంభూ శ్రీ ఎల్లమ్మ అమ్మవారు బుధవారం భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ పూజారి మల్లాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ వెంకటరెడ్డి, ఈవో నాగిరెడ్డి పాల్గొన్నారు.