News March 5, 2025
NLG: నాన్నా.. నీ ప్రేమకు సలాం..!

ఆడబిడ్డ.. అందులోనూ దివ్యాంగురాలు.. ఆమెకు చదువెందుకులే అని ఆ తండ్రి అనుకోలేదు. దివ్యాంగురాలైతేనేం తన బిడ్డ సరస్వతి మాతకు ప్రతిరూపం అంటూ ఆ తండ్రి చెబుతున్నాడు.మర్రిగూడ(M) శివన్నగూడెంకు చెందిన సత్యనారాయణ, ధనమ్మ దంపతుల కూతురు మోర శివానికి ఫ్లోరసిస్ కారణంగా చిన్నప్పుడే కాళ్లు పనిచేయడం లేదు. నేడు మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసేందుకు తండ్రి తన బిడ్డను ఎత్తుకుని తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారు.
Similar News
News April 10, 2026
ఆత్మకూరు: రూటు మార్చి అక్రమ రవాణా..!

అక్రమ రవాణాదారులు నిషేధిత చికెన్ వ్యర్థాలను బహిరంగంగానే తరలిస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఎన్నిసార్లు దాడులు చేసి కేసులు పెట్టినా అక్రమ రవాణా ఆపడం లేదు. బద్వేల్ నుంచి వస్తున్న వాహనాలు దారి మార్చాయి. హైవేను తప్పించి అనంతసాగరం మండలంలోని పల్లెల మీదుగా రొయ్యల, చేపల గుంటలకు ఈ వ్యర్థాలు తరలిస్తున్నారు.
News April 10, 2026
పెద్దపల్లి: ‘పుష్కర ఘాట్ల రోడ్లు గడువులోగా పూర్తిచేయాలి’

పుష్కరాల ఘాట్లకు వెళ్లే రహదారులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆర్&బి, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలతో సమీక్ష నిర్వహించారు. మంథని, గోలివాడ ఘాట్ల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. భారీగా భక్తులు వచ్చే అవకాశముండటంతో శాశ్వత సదుపాయాలు కల్పించాలని తెలిపారు. మంథని ఘాట్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
News April 10, 2026
ఖమ్మం: పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనని ఇంటర్ విద్యార్థి సూసైడ్

పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే ఆందోళనతో ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బోనకల్ మండలం రాపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి గంగాదేవుళ్ల ఆశాంత్ గురువారం రాత్రి మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్కే ఫౌండేషన్ సహకారంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


