News January 1, 2025

NLG: నిలిచిన రేషన్ బియ్యం సరఫరా

image

డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఈరోజు నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. కార్మికుల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా అన్ని గోదాములలో ఎగుమతి, దిగుమతి నిలిచిపోయింది. సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గతంలో అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని, స్పందించకపోవడంతో సమ్మెకు దిగామని హమాలీ నాయకులు అంటున్నారు. 

Similar News

News December 24, 2025

నల్గొండ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

డిండి: రోడ్డుపైకి అడవి పంది.. యువకుడి మృతి
మిర్యాలగూడలో యువకుడి శవం కలకలం
నల్గొండ : మంత్రులపై కేటీఆర్ కామెంట్స్
కనగల్: వైద్య సేవలపై కలెక్టర్ ఆరా
కట్టంగూరు: పశు వైద్యశాలల్లో మందుల్లేవ్
నల్గొండ: చలిలో మున్సిపల్ కార్మికు అరిగోస
నల్గొండ: 2025@ విషాదాల సంవత్సరం
నల్గొండ: జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్ల ధర్నా

News December 23, 2025

రేపు నల్గొండలో ట్రై సైకిళ్ల పంపిణీ

image

జిల్లాలోని దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం మరో ముందడుగు వేసింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక చొరవతో ఈసీఐఎల్ సీఎస్‌ఆర్ నిధుల కింద సుమారు రూ.70 లక్షల వ్యయంతో 105 మంది బాధితులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. రేపు(బుధవారం) ఉదయం 10 గంటలకు స్థానిక మహిళా ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు ఈసీఐఎల్ ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు.

News December 23, 2025

దరఖాస్తుల పెండింగ్‌పై నల్గొండ కలెక్టర్ సీరియస్

image

విద్యార్థుల ఉపకార వేతనాలకు ఆటంకం కలగకుండా కుల, ఆదాయ ధ్రువపత్రాలను తక్షణమే జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం కనగల్ మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆమె ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్థితిగతులను సమీక్షించారు. సర్టిఫికేట్ల జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ, అవసరమైతే ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.