News August 20, 2024
NLG: నేటి నుంచి ఓటరు నమోదు

ఓటరు నమోదు కోసం ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. 2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ, యువకులు ఓటు నమోదు చేసుకునేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి బిఎల్వోలు ఇంటింటికి తిరిగి ఓటర్ నమోదు చేయించనున్నారు.
Similar News
News October 25, 2025
NLG: లక్కు ఎవరిదో.. డ్రా కోసం కౌంట్ డౌన్

జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం లక్కీ డ్రా ప్రక్రియకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో టెండర్ దారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈసారి లక్కు ఎవరిని వరించబోతుందోనన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. కొత్తగా టెండర్ వేసిన వారు మొదటి అవకాశంపై ఆశలు పెట్టుకున్నారు. ఈనెల 27న నల్గొండ లక్ష్మీ గార్డెన్స్లో డ్రాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News October 25, 2025
నల్గొండ: పెరగనున్న ఎరువుల ధరలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వచ్చే యాసంగి సీజన్లో సాగుచేసే పంటలకు వేసే ఎరువుల ధరలు మరింత భారం కానున్నాయి. తాజాగా కొన్ని కాంప్లెక్స్ ఎరువుల ధరలు సంచికి రూ.50 పెరగ్గా మరి కొన్నింటికి 50కిలోల బస్తాపై రూ.25 నుంచి రూ.వంద వరకు ధరల పెంపు ఉంటుందని ఎరువుల దుకాణాల డీలర్లకు కంపెనీలు సమాచారం ఇచ్చాయి. ప్రస్తుతం పాత నిల్వలు ఉండడంతో గతంలో ఉన్న ధరలకే విక్రయిస్తున్నారు. పెరగనున్న ఎరువుల ధరలు రైతులకు భారం కానున్నాయి.
News October 25, 2025
NLG: బీసీ, ఎస్సీలకు ఎక్కడ అవకాశం ఇస్తారో..!

డీసీసీలు ఇవాళ ఖరారు కానున్నారు. ఢిల్లీలో అధిష్ఠానంతో రాష్ట్ర ముఖ్య నేతల భేటీలో జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. కాగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాను యూనిట్గా తీసుకోనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలు ఎంతమంది ఉండాలన్నది నిర్ణయించి అధ్యక్షులను ఖరారు చేస్తారన్న చర్చ జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో బీసీ, ఎస్సీలకు ఎక్కడ అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


