News May 23, 2024
NLG: నేడు ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష
ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షను గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇందు కోసం సూర్యాపేటలో 1, కోదాడలో 2, నల్గొండలో 1 మొత్తం 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు సెషన్లలో నిర్వహించే ఈ పరీక్షకు అన్ని కేంద్రాల్లో కలిపి మొత్తం 1100 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎడ్ సెట్ ఛైర్మన్ ఆచార్య గోపాల్రెడ్డి పేర్కొన్నారు.
Similar News
News October 2, 2024
భువనగిరి: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సమీక్ష సమావేశం
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలని కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్డుల జారీ కోసం ప్రయోగాత్మకంగా ఈ నెల 3 నుంచి చేపట్టనున్న ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News October 1, 2024
NLG: పోలీసుల కనుసన్నల్లోనే కేటీఆర్పై దాడి: జగదీశ్ రెడ్డి
తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతాల భాదితులను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్పై దాడి హేయమైన చర్య అన్నారు. పోలీసుల కనుసన్నల్లోనే పథకం ప్రకారం దాడి జరిగింది అని అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ను ఆపి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు పోలీసులు సహకరించారు అని తెలిపారు.
News October 1, 2024
పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!
సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని నల్గొండ,సూర్యాపేట, యాదాద్రి జిల్లావాసులు ఆలోచనలు పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.