News September 11, 2024

NLG: నేడు దామరచర్ల‌లో మంత్రుల పర్యటన

image

నల్గొండ జిల్లాలోని దామరచర్లలో మంత్రుల పర్యటనలో భాగంగా హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉ.11:00 కి మిర్యాలగూడ, దామరచర్ల, యాదాద్రి పవర్ ప్లాంట్ మంత్రుల పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవర్ ప్లాంట్ పురోగతిపై రాష్ట్ర మంత్రులు సమీక్షించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

Similar News

News November 13, 2025

కట్టంగూర్: వెయ్యి కొట్టు.. ఫ్లాట్ పట్టు

image

ఆపదలో అక్కరపడతాయని కొనుగోలు చేసిన స్థిరాస్తులను అమ్మేందుకు యజమానులు పడరాని పాట్లు పడుతున్నారు. చివరకు లక్కీ డ్రా పేరుతో ప్లాట్లను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టంగూర్‌కు చెందిన మేకల రమేష్.. ‘వెయ్యి కొట్టు ప్లాటు పట్టు’ అంటూ బ్రోచర్లను సిద్ధం చేసి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంబేడ్కర్ నగర్ కాలనీలో 147 గజాల ప్లాట్ లక్కీ డ్రా తరహాలో బేరానికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

News November 13, 2025

NLG: ఇందిరమ్మ లబ్ధిదారులకు మరుగుదొడ్లు

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్దిపొందిన వారికి వ్యక్తిగత మరుగుదొడ్లు కేటాయించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం 34,023 ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు వెంటనే వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో 19,697 ఇండ్లు మంజూరయ్యాయి. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి వీరికి మరుగుదొడ్లను మంజూరు చేయనున్నారు.

News November 12, 2025

నల్గొండలో సదరం కేంద్రం ప్రారంభించిన మంత్రి

image

దివ్యాంగుల కోసం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు జారీ కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ కేంద్రం ద్వారా దివ్యాంగులకు వైకల్య గుర్తింపు కార్డులు సులభంగా, వేగంగా లభించే సదుపాయం కలుగుతుందని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ముఖ్యమైన ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు.