News November 8, 2024
NLG: నేడు సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర

సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి- భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం సంగెం నుంచి భీమలింగం వరకు 2.5 కి.మీ మేర మూసీ పునరుజ్జీవ సంకల్ప పేరిట పాదయాత్ర చేపట్టనున్నారు. ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం-నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు యాత్ర చేస్తారు. అక్కడే రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు.
Similar News
News October 21, 2025
ప్రజల కోసం పదవి త్యాగానికి సిద్ధం: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ప్రజలకు మంచి జరుగుతుందంటే ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధమే” అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇస్తే తీసుకుంటానని, లేదంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.
News October 21, 2025
NLG: జాడ లేని టి ఫైబర్ పథకం

జిల్లాలోని పంచాయతీలకు డిజిటల్ సేవలను అందించాలనే లక్ష్యంతో చేపట్టిన టి-ఫైబర్ పథకం జాడ లేకుండా పోయింది. పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఇంటింటికీ అంతర్జాల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వం టి-ఫైబర్ ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్ర ఐటీశాఖ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసేలా పనులు ఆదిలోనే అటకెక్కాయి. అనేకచోట్ల పంచాయతీల్లో సౌర పలకలు అలంకారప్రాయంగా మారాయి.
News October 21, 2025
NLG: కరాటే శిక్షకుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లాలోని PMSHRI పథకం కింద (36 ) ప్రభుత్వ స్కూల్స్ నందు బాలికలకు స్వీయ రక్షణకు సంబందించి 3 నెలల శిక్షణ ఇచ్చేందుకు కరాటే శిక్షకులు కావాలని జిల్లా యువజన, క్రీడల అధికారి మహ్మద్ అక్బర్ అలీ తెలిపారు. ఇందుకు గాను బ్లాక్ బెల్ట్ కలిగిన వారు అర్హులు వారికి నెలకు రూ. 10 వేలు చొప్పున పారితోషకం ఇస్తామన్నారు. మొదటిగా మహిళా అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.