News November 8, 2024
NLG: నేడు సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర

సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి- భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం సంగెం నుంచి భీమలింగం వరకు 2.5 కి.మీ మేర మూసీ పునరుజ్జీవ సంకల్ప పేరిట పాదయాత్ర చేపట్టనున్నారు. ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం-నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు యాత్ర చేస్తారు. అక్కడే రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు.
Similar News
News November 17, 2025
సమ్మె వద్దు.. సమస్యలు పరిష్కరిస్తాం: నల్గొండ కలెక్టర్

పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మె విరమించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా తాము రాష్ట్ర అసోసియేషన్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని జిన్నింగి మిల్లుల యజమానులు కలెక్టర్కు తెలిపారు.
News November 17, 2025
మునుగోడు: తెలుగు ఉపాధ్యాయుడి సస్పెన్షన్

మునుగోడు(M) పలివెల జడ్పీ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు గేర నరసింహను సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. 4 రోజుల క్రితం ఆ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థి హనుమాన్ మాల వేసుకుని పాఠశాలకు రాగా సదరు ఉపాధ్యాయుడు అసభ్యంగా మాట్లాడడంతో పాటు మాలతీసి పాఠశాలకు రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రాథమిక విచారణ చేసిన అనంతరం ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.
News November 17, 2025
నల్గొండ: ఆరుగురు డిశ్చార్జి.. 11 మందికి చికిత్స

ఇంజెక్షన్ వికటించి అస్వస్థతకు గురైన 17 మంది చిన్నారులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. కొంతమంది ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్యులు పై అధికారులకు సమాచారం ఇచ్చి.. వారి సలహాల మేరకు వైద్యం అందించడంతో పిల్లలంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆదివారం ఆరుగురు చిన్నారులు డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ భానుప్రసాద్ తెలిపారు. 11 మంది చికిత్స పొందుతున్నారన్నారు.


