News May 26, 2024

NLG: పానగల్ చెరువులో వ్యక్తి గల్లంతు

image

ఈదురుగాలులతో పానగల్ చెరువులో ఒకరు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం.. చందనపల్లికి చెందిన కొందరు చేపలు పట్టడానికి చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలో ఈదురుగాలులు వీయడంతో చెరువులో గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు ఈత కొట్టుకుంటు పానగల్ కట్టవైపు వెళ్లి బయటపడగా.. కోడదల సైదులు చెరువులో గల్లంతయ్యారు. చీకటి వల్ల గాలించే పరిస్థితి లేకపోవడంతో సైదులు కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 28, 2026

తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: కలెక్టర్ ఆదేశం

image

ఎండాకాలంలో ప్రజలకు, పశువులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 100 రోజుల కార్యచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పురోగతి సాధించాలని స్పష్టం చేశారు.

News February 28, 2026

నల్గొండలో ఉపాధి నిధుల రాజకీయం

image

నల్గొండ ఉమ్మడి జిల్లాకు ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ. 211.36 కోట్ల నిధుల పంపిణీ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. గత రెండేళ్లుగా నిధుల కొరతతో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ వాటా కోసం పట్టుబడుతుండటమే దీనికి కారణం. గతంలో మంత్రి కోమటిరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా మధ్య జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో, తాజా నిధుల కేటాయింపు అంశం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

News February 27, 2026

NLG: ఇంటర్ పరీక్షలు.. మూడోరోజు 339 మంది గైర్హాజరు

image

జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 339 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ వెల్లడించారు. జనరల్ విభాగంలో మొత్తం 11,751 మంది విద్యార్థులకు గాను 11,535 మంది హాజరుకాగా, 216 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,566 మంది విద్యార్థులకు గాను 1,443 మంది హాజరుకాగా, 123 మంది గైర్హాజరయ్యారు.