News May 26, 2024
NLG: పానగల్ చెరువులో వ్యక్తి గల్లంతు

ఈదురుగాలులతో పానగల్ చెరువులో ఒకరు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం.. చందనపల్లికి చెందిన కొందరు చేపలు పట్టడానికి చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలో ఈదురుగాలులు వీయడంతో చెరువులో గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు ఈత కొట్టుకుంటు పానగల్ కట్టవైపు వెళ్లి బయటపడగా.. కోడదల సైదులు చెరువులో గల్లంతయ్యారు. చీకటి వల్ల గాలించే పరిస్థితి లేకపోవడంతో సైదులు కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 12, 2025
నల్గొండకు నేషనల్ అవార్డు

జల్ సంజయ్ జన్ భాగిదారీలో రాష్ట్రానికి తొలి ర్యాంకు వచ్చింది. రాష్ట్రంలో నల్గొండతో పాటు ఆదిలాబాద్ మంచిర్యాల జల సంరక్షణలో టాప్లో నిలిచిన విషయం విదితమే. ఈ పథకాన్ని పక్కాగా అమలు పరిచినందుకు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు జిల్లాకు రావడం తొలిసారి. కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవ వల్లే ఇది సాధ్యమైంది. ఈ పురస్కారం కింద రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం లభించనుంది.
News November 12, 2025
NLG: ధాన్యం సేకరణపై కలెక్టర్ మార్గదర్శం

నవంబర్, డిసెంబర్ తొలి వారంలో పెద్దఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున, కొనుగోలు ప్రక్రియలో పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ ఇల్లా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆమె సంబంధిత శాఖల అధికారులు, తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులకు ఈ మేరకు స్పష్టమైన సూచనలు చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు.
News November 12, 2025
NLG: సన్నబియ్యంలో నూకలే అధికం: లబ్ధిదారులు

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా ఉంటున్నాయని జిల్లాలోని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గత 2 నెలల నుంచి పంపిణీ చేస్తున్న బియ్యంలో 20% పైగా నూకలు ఉంటున్నాయని వారు తెలిపారు. జిల్లాలో మొత్తం 4,66,100 రేషన్ కార్డులు ఉండగా, ప్రతినెలా జిల్లా వ్యాప్తంగా 94.04 లక్షల క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. మీకు కూడా ఇదే సమస్య పునరావృతం అవుతుందా? కామెంట్.


