News March 29, 2024

NLG: పార్లమెంటు ఎన్నికల సన్నాక సమావేశం విజయవంతం చేయాలి

image

ఈనెల 30న నల్గొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం విజయవంతం చేయాలని మఠంపల్లి మండల నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మఠంపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో జరుగు నల్గొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News March 13, 2026

చెరువుగట్టు రామలింగేశ్వరుడికి భారీ ఆదాయం

image

చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించిన వివిధ వేలం పాటలు గుడికి రికార్డు స్థాయి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. మొత్తం ఐదు విభాగాల్లో నిర్వహించిన ఈ టెండర్ల ద్వారా దేవస్థానానికి రూ.50,22,887 ఆదాయం సమకూరినట్లు EO సల్వాది మోహన్ బాబు తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈసారి వేలం పాటల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది రూ.13 లక్షలకుపైగా అదనపు ఆదాయం లభించింది.

News March 13, 2026

NLG: జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

image

జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరతలేదని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన తన ఛాంబర్లో గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో LPG సరఫరాపై సమావేశం నిర్వహించారు. HPCL, IOCL, BPCL LPG ఆయిల్ కంపెనీలు గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాయన్నారు. గృహ అవసరాల గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు మళ్లించిన 16మందిపై కేసులు పెట్టామన్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాలో మాత్రమే స్వల్ప ఇబ్బందులు ఉన్నాయన్నారు.

News March 12, 2026

కొండమల్లేపల్లిలో 60 సిలిండర్లు సీజ్

image

కొండమల్లేపల్లిలో పౌర సరఫరాల శాఖ అధికారులు హోటల్, రెస్టారెంట్, దాబాలపై గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమంగా వినియోగిస్తున్న 60 సిలిండర్లను సీజ్ చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ముబీన్, దీపక్, సైదులు, ముక్తర్, జ్యోతి, కుమార్ పాల్గొన్నారు.