News March 16, 2025
NLG: పోరుబాటకు సిద్ధమైన అంగన్వాడీలు

తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై మరోసారి పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమయ్యారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీచర్లు, ఆయాలు ఈనెల 17, 18వ తేదీల్లో నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ధర్నాకు సంబంధించి ఐసీడీఎస్ కార్యాలయాల్లో అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. ఐసీడీఎస్ నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని రద్దు చేయాలని కోరారు.
Similar News
News December 23, 2025
దరఖాస్తుల పెండింగ్పై నల్గొండ కలెక్టర్ సీరియస్

విద్యార్థుల ఉపకార వేతనాలకు ఆటంకం కలగకుండా కుల, ఆదాయ ధ్రువపత్రాలను తక్షణమే జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం కనగల్ మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆమె ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్థితిగతులను సమీక్షించారు. సర్టిఫికేట్ల జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ, అవసరమైతే ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
News December 23, 2025
NLG: అమ్మో ర్యాగింగ్ భూతం..!

కోటి ఆశలతో ఉన్నత విద్యను అభ్యసించడానికి కళాశాలల్లో అడుగుపెట్టే విద్యార్థులను ర్యాగింగ్ భూతం భయపెడుతుంది. జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. స్థానిక మెడికల్ కళాశాలలో ప్రారంభమైన ఈ విష సంస్కృతి క్రమంగా డిగ్రీ కళాశాలల్లోకి ప్రవేశించింది. తాజాగా స్థానిక గురుకుల కళాశాలలో తోటి విద్యార్థుల వేధింపుల కారణంగా ఓ విద్యార్థిని 4 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
News December 23, 2025
NLG: 2025@విషాదాల సంవత్సరం

2025లో NLG జిల్లాలో పలు భారీ రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. HYD-సాగర్, HYD- VJD, NKP- అద్దంకి హైవేలపై భారీ ప్రమాదాలు జగిరాయి. ఈ ప్రమాదాలలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్సలు పొందారు. 2025లో రాచకొండ పరిధిలో (NLGలో కొంత భాగం ) మొత్తం 3,488 రోడ్డు ప్రమాదాలు జరగగా.. అందులో 650 మంది మరణించినట్లు సమాచారం.


