News June 26, 2024

NLG: ప్రజల భద్రత గాల్లో దీపమేనా ?

image

జిల్లాలో మళ్లీ క్రైమ్ రేట్ పెరుగుతుంది. హత్యలు, దొంగతనాలు జాతీయ రహదారిపై దోపిడీలతో కొంతకాలంగా ప్రజలు భద్రత గాల్లో దీపంలా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. పట్టపగలే దొంగతనాలు జరుగుతున్నా.. రాత్రిపూట జాతీయ రహదారిపై దోపిడీలు జరుగుతున్నా పోలీసులు కనీస చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల NKP మండలం ఏపీ లింగోటం వద్ద, చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద దారి దోపిడీలు జరిగాయి.

Similar News

News November 28, 2025

ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు వేయొచ్చు: ఇలా త్రిపాఠి

image

కలెక్టర్ ఇలా త్రిపాఠి మర్రిగూడ మండలం సరంపేట నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చండూర్ ఆర్డీఓ శ్రీదేవి, మర్రిగూడ తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో మున్నయ్య తదితరులు పాల్గొన్నారు.

News November 28, 2025

అభ్యర్థులకు నల్గొండ కలెక్టర్ కీలక సూచన

image

పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో ఎక్కడా కూడా ఖాళీగా వదిలి వేయవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ పత్రాల్లో అంశాలు ఏవైనా తమకు వర్తించకపోతే నాట్ అప్లికేబుల్ (NA) లేదా నిల్ అని రాయాలన్నారు. ఖాళీగా వదిలేస్తే మాత్రం అభ్యర్థిత్వం తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. నామినేషన్ పత్రాలను రాయడంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

News November 28, 2025

నల్గొండ: సోషల్‌ మీడియాపై ఎస్పీ ప్రత్యేక నిఘా

image

గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ సోషల్‌ మీడియా కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్ తెలిపారు. ​సోషల్‌ మీడియా వేదికగా ఎవరైనా అసత్య ప్రచారం చేసినా, లేక ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూసినా, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం ఉపేక్షించబోరని ఆయన స్పష్టం చేశారు.