News March 25, 2025
NLG: ప్రాణం తీసిన ఈత సరదా

నల్గొండ జిల్లా దండెంపల్లి<<15883784>> SLBC కాలువలో<<>> ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాగార్జున డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి పోతుగంటి ఉదయ్ కుమార్ మృతి చెందాడు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు సూర్యాపేట జిల్లా నాగారం వాసిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 19, 2025
నెల్లూరు: చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు ఎప్పుడు..?

చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తామంటూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం 100 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. దీంతో చేనేతలు కరెంట్ బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 7 వేల చేనేత కుటుంబాలు ఉన్నాయి. చేనేత కార్మికులకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ జీవో విడుదలైంది కానీ అది ఇంతవరకు ఆచరణలోకి రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
News October 19, 2025
జూబ్లీహిల్స్: 8 పోలీస్ స్టేషన్లు.. 234 ఆయుధాలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 234 మంది వద్ద లైసెన్డ్స్ ఆయుధాలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా వాటిని స్థానిక PSలలో డిపాజిట్ చేయాలి. అయితే ఇప్పటి వరకు 196 మంది తుపాకులను పోలీసులకు అందజేశారు. పంజాగుట్ట PS పరిధిలో 26 ఉండగా 19, మధురానగర్లో 23 ఉండగా 17, బోరబండలో 37కు 27, జూబ్లీహిల్స్లో 27కు 23, ఫిలింనగర్లో 6కు 5, టోలిచౌకిలో 106కు 96, సనత్నగర్లో 2కు 2, గోల్కోండ పరిధిలో 7ఉండగా 7 ఆయుధాలను అప్పగించారు.
News October 19, 2025
జూబ్లీహిల్స్: 8 పోలీస్ స్టేషన్లు.. 234 ఆయుధాలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 234 మంది వద్ద లైసెన్డ్స్ ఆయుధాలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా వాటిని స్థానిక PSలలో డిపాజిట్ చేయాలి. అయితే ఇప్పటి వరకు 196 మంది తుపాకులను పోలీసులకు అందజేశారు. పంజాగుట్ట PS పరిధిలో 26 ఉండగా 19, మధురానగర్లో 23 ఉండగా 17, బోరబండలో 37కు 27, జూబ్లీహిల్స్లో 27కు 23, ఫిలింనగర్లో 6కు 5, టోలిచౌకిలో 106కు 96, సనత్నగర్లో 2కు 2, గోల్కోండ పరిధిలో 7ఉండగా 7 ఆయుధాలను అప్పగించారు.