News March 25, 2025
NLG: ప్రాణం తీసిన ఈత సరదా

నల్గొండ జిల్లా దండెంపల్లి<<15883784>> SLBC కాలువలో<<>> ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాగార్జున డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి పోతుగంటి ఉదయ్ కుమార్ మృతి చెందాడు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు సూర్యాపేట జిల్లా నాగారం వాసిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 24, 2025
డిటెన్షన్ సెంటర్లకు అక్రమ వలసదారులు: యూపీ సీఎం

అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను యూపీ CM యోగి ఆదేశించారు. ప్రతి జిల్లాలో తాత్కాలిక డిటెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. విదేశీ పౌరసత్వం ఉన్న వలసదారుల వెరిఫికేషన్ పూర్తయ్యేవరకు డిటెన్షన్ సెంటర్లలో ఉంచాలని సూచించారు. వారు స్థిరపడిన విధానాన్ని బట్టి స్వదేశాలకు పంపించాలన్నారు. మరోవైపు 8ఏళ్లుగా అధికారంలో ఉండి ఇప్పుడు కావాలనే హడావిడి చేస్తున్నారని కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ ఆరోపించారు.
News November 23, 2025
ఇలా పడుకుంటే ప్రశాంతమైన నిద్ర

రాత్రిళ్లు ప్రశాంతమైన నిద్ర కోసం ఎడమ వైపు పడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ‘బోర్లా, వెల్లకిలా కంటే ఈ పొజిషన్లో మంచి నిద్ర వస్తుంది. గుండెకు రక్తసరఫరా, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శ్వాసలో ఇబ్బందులు, గురక సమస్య తగ్గుతుంది. ఎక్కువసేపు బోర్లా పడుకుంటే నడుము, మెడ నొప్పి, శ్వాస సమస్యలు పెరుగుతాయి. తల కింద దిండు అలవాటు ఉన్నవాళ్లు సాఫ్ట్ పిల్లోలను ఎంచుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News November 23, 2025
WNP: శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్పీ నాయకత్వం కీలకం: కలెక్టర్

వనపర్తి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణలో ఎస్పీ రావుల గిరిధర్ నాయకత్వం విశేషమైనదని కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. ప్రజలకు దగ్గరగా ఉండే పోలీసింగ్ పద్ధతిని అమలులోకి తీసుకువచ్చి, సేవలో సమగ్రతకు కొత్త ప్రమాణాలు నెలకొల్పారని అన్నారు. జిల్లాకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ పేర్కొన్నారు.


