News February 12, 2025

NLG: ప్రారంభమైన నామినేషన్‌ల ఉపసంహరణ

image

వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. నల్గొండ కలెక్టరేట్లోని ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉపసంహరించుకోవాలని, ఉపసంహరణకు ఒక్కరోజే సమయమని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా 1 నామినేషన్ తిరస్కరణకు గురి కాగా 22 మంది బరిలో ఉన్నారు.

Similar News

News November 28, 2025

సిద్దిపేట: జిల్లాలో తొలి సర్పంచ్ ఏకగ్రీవం !

image

పంచాయతీ ఎన్నికల నామినేషన్ తొలిరోజే జగదేవ్‌పూర్ మండలం, బిజీ వెంకటాపూర్ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. చెక్కల పరమేశ్వర్ పోటీ లేకుండానే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి పరమేశ్వర్ నాయకత్వమే సరైనదని నమ్మిన గ్రామస్థులు, ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

News November 28, 2025

ఖమ్మంలో JOBS.. APPLY

image

ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ హైస్కూల్‌లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ఛైర్‌పర్సన్ నిష్ణా శర్మ తెలిపారు. ప్రైమరీ టీచర్ పోస్టుకు డీఈడీ/బీఈడీ, మ్యూజిక్ టీచర్ పోస్టుకు వాయిద్య పరిజ్ఞానం తెలిసి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను kpmhskmm@gmail.comకు పంపవచ్చు లేదా 94405 25093 నంబర్‌ను సంప్రదించాలని ఆమె కోరారు.
SHARE IT

News November 28, 2025

తాటిపర్తి: పుట్టిన రోజు వేడుకలో గొడవ.. వ్యక్తి మృతి

image

తాటిపర్తిలో గురువారం రాత్రి జరిగిన వాగ్వాదం విషాదంగా మారింది. శ్రీమంతుల దయ మనుమరాలు పుట్టినరోజు వేడుకల్లో రోడ్డుపై పెట్టిన బల్లను కృష్ణవేణి అనే మహిళ అటుగా వెళ్తూ బల్లలకు తగలడంతో బల్ల పడిపోయింది. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ఈ వాగ్వాదం జరుగుతుండగా వెంపల సూరి బాబు (59) ఆకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. ఈ ఘటనపై గొల్లప్రోలు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.