News February 12, 2025
NLG: ప్రారంభమైన నామినేషన్ల ఉపసంహరణ

వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. నల్గొండ కలెక్టరేట్లోని ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉపసంహరించుకోవాలని, ఉపసంహరణకు ఒక్కరోజే సమయమని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా 1 నామినేషన్ తిరస్కరణకు గురి కాగా 22 మంది బరిలో ఉన్నారు.
Similar News
News December 19, 2025
నల్గొండ: ‘అమ్మా SORRY.. నేను చనిపోతున్నా’

నల్గొండ టౌన్ పరిధి చర్లపల్లిలోని <<18614490>>సాంఘిక సంక్షేమ వసతి గృహంలో<<>> విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. బాలిక రాసిన సూసైడ్ లెటర్ రూమ్లో లభ్యమైంది. ‘అమ్మా సారీ.. నాకు బతకాలని లేదు.. నేను నీకు రుణపడి ఉంటానమ్మా.. నేను చనిపోయాక నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుతారు అవి పట్టించుకోకు.. ఏం తప్పు చేయకపోయినా ఈ సమాజం నిందలు మోపుతుంది.. నీ ప్రేమను మర్చిపోనమ్మా’ అని రాసింది.
News December 19, 2025
ప్రకృతి విపత్తులపై ముందస్తు ప్రణాళిక రచించాలి: కలెక్టర్

ప్రకృతి విపత్తులపై ముందస్తు ప్రణాళిక వేసుకుని ఉండాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. సి.ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి విపత్తులు, మాక్ డ్రిల్ అవగాహన అంశంపై నిర్వహించిన వీడియో కాన్ఫిడెన్స్లో మాట్లాడారు. విపత్తులు సంభవించినప్పుడు అధికారులు యంత్రాంగం ఎంత వేగంగా స్పందిస్తారు అనే అంశంపై ఆధారపడి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 19, 2025
బురుజుపేట: అమ్మవారిని దర్శించుకున్న 10 లక్షల మంది

మార్గశిరమాసం కనకమహాలక్ష్మి అమ్మవారి నెలరోజులు దర్శనాలు విజయవంతంగా నిర్వహించి నేటితో ముగిశాయని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారన్నారు. 10 లక్షల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారని తెలిపారు. మహా అన్నదానంలో 20వేల మందికి ప్రతిరోజు అన్నదానం చేశామని చెప్పారు. పోలీసులు సహకరించారని చెప్పారు.


