News March 23, 2025

NLG: బర్డ్ ఫ్లూ ఉద్ధృతి.. 52 RRT బృందాల ఏర్పాట్లు

image

ఉమ్మడి NLG జిల్లాలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. వ్యాధి ఉద్ధృతి నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ 52 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను (RRT) ఏర్పాటు చేసింది. కోళ్ల శాంపిల్స్ సేకరించేందుకు వీరికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. కాగా గుండ్రాంపల్లి, నేలపట్ల, దోతిగూడెం గ్రామాల్లో వేలకొద్ది గుడ్లు, టన్నుల కొద్ది ఫీడ్‌ను అధికారులు ఇప్పటికే పూడ్చారు. ఆ ప్రాంతాల నుంచి 3 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్‌గా ప్రకటించారు.

Similar News

News September 18, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤ టెక్కలి, జలుమూరు, పాతపట్నం, పొందూరు, శ్రీకాకుళానికి నూతన ఎంపీడీఓలు
➤అరసవల్లి: ఘనంగా ఆదిత్యుని కళ్యాణం.
➤అధ్వానంగా ముంగెన్నపాడు రోడ్డు.
➤ శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల విశ్వకర్మ జయంతి.
➤నరసన్నపేట: ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు.
➤ఇచ్ఛాపురంలో గంజాయితో ఇద్దరు అరెస్ట్.
➤శ్రీకాకుళం: వైసీపీ ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం
➤ మా శత్రువు టీడీపీనే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

News September 18, 2025

కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో రేపటి నుంచి వందే భారత్ హాల్టింగ్: శ్రీధర్

image

కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో రేపటి నుంచి వందే భారత్ రైలు హాల్టింగ్ ఇవ్వనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఏ.శ్రీధర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి ప్రతిరోజు మ.3:15 గంటలకు కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ ఉండనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీ గోడెం నాగేశ్ సికింద్రాబాద్-నాగపూర్ వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు.

News September 18, 2025

SRPT: ‘సీఎంఆర్ లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలి’

image

సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో మిల్లర్లు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సీఎంఆర్ గడువును NOV 12 వరకు పొడిగించిందని, మిల్లర్లు అందరూ సహకరించి గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆయన కోరారు. మిల్లులను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ సీఎంఆర్ పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు.