News March 23, 2025
NLG: బర్డ్ ఫ్లూ ఉద్ధృతి.. 52 RRT బృందాల ఏర్పాట్లు

ఉమ్మడి NLG జిల్లాలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. వ్యాధి ఉద్ధృతి నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ 52 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను (RRT) ఏర్పాటు చేసింది. కోళ్ల శాంపిల్స్ సేకరించేందుకు వీరికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. కాగా గుండ్రాంపల్లి, నేలపట్ల, దోతిగూడెం గ్రామాల్లో వేలకొద్ది గుడ్లు, టన్నుల కొద్ది ఫీడ్ను అధికారులు ఇప్పటికే పూడ్చారు. ఆ ప్రాంతాల నుంచి 3 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్గా ప్రకటించారు.
Similar News
News November 18, 2025
అనకాపల్లి: ‘టీచర్లు సమస్యలు పరిష్కరించాలని వినతి”

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం అనకాపల్లిలో డీఈవో అప్పారావు నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు సెలవు పెడితే వారి స్థానంలో సర్ప్లస్ టీచర్స్ను డిప్యూటేషన్పై పంపించాలన్నారు. 2024-25లో స్పాట్ వాల్యూషన్ ఉపాధ్యాయులకు డీఏ చెల్లించాలన్నారు.
News November 18, 2025
TU: పీజీ ద్వితీయ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసిన వీసీ

తెలంగాణ యూనివర్సిటీలో ఆగస్టు/సెప్టెంబర్లో జరిగిన పీజీ (ఎం.ఏ/ఎమ్మెస్సీ/ఎం.కామ్) ద్వితీయ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ఉపకులపతి (వీసీ) ప్రొఫెసర్ టి.యాదగిరి రావు మంగళవారం విడుదల చేశారు. రిజిస్ట్రార్ ప్రొ. ఎం.యాదగిరి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ.కే.సంపత్ కుమార్లతో కలిసి వీసీ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చంద్రశేఖర్, డా.టి. సంపత్ పాల్గొన్నారు.
News November 18, 2025
పనులు త్వరగా పూర్తి చేయాలి: దీపక్ తివారి

ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని ASF జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ, విద్య, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలు, వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.


