News December 31, 2024

NLG: ‘బీజేపీ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలి’

image

బీజేపీ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా పిలుపునిచ్చారు. సోమవారం సీపీఐ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నల్గొండ ఎన్జీ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీతో పాటు కమ్యూనిస్టు పార్టీ కూడా పోరాటం చేసిందన్నారు. అదే స్ఫూర్తితో మతోన్మాధ బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు.

Similar News

News February 25, 2026

NLG: సెల్లులు స్విచాఫ్.. అజ్ఞాతంలో రైస్ మిల్లర్లు..!

image

జిల్లాలో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధాన్యం కుంభకోణానికి పాల్పడిన మిల్లర్లు పోలీసులకు దొరకకుండా పరారయ్యారు. తమపై కేసులు నమోదు కాబోతున్నాయనే ముందస్తు సమాచారంతో శనివారం నుంచే వారంతా ఫోన్లు స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పందించారు. ప్రభుత్వ ధాన్యాన్ని లూటీ చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామన్నారు.

News February 25, 2026

నల్గొండ: ఇంటర్ పరీక్షలకు 45 సెంటర్స్

image

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ బి.చంద్రశేఖర్ మంగళవారం సమీక్ష నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 45 కేంద్రాలలో 27,018 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలని, విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు.

News February 25, 2026

నల్గొండ: ఇంటర్ పరీక్షలకు 45 సెంటర్స్

image

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ బి.చంద్రశేఖర్ మంగళవారం సమీక్ష నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 45 కేంద్రాలలో 27,018 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలని, విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు.