News February 5, 2025
NLG: బీడు భూముల్లో బంగారం పండిస్తున్నాడు

నల్గొండ జిల్లా చందంపేట మండలం అంటేనే బీడు భూములు, కరువు కాటకాలతో కూడిన ప్రాంతం. భూగర్భ జలాలు లేక రైతులు అల్లాడుతుంటారు. ఆ బీడు భూముల్లోనే బంగారం పడిస్తున్నాడు రైతు పద్మారెడ్డి. వినూత్నంగా తన 12ఎకరాల్లో 1991లోనే 1200 కుంకుడు మొక్కలు నాటి ఎకరాకు రూ.5వేల పెట్టుడితో రూ.13లక్షల ఆదాయం పొందుతున్నాడు. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి సాధిస్తూ.. కిలో కుంకుడుకాయలు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నాడు.
Similar News
News November 27, 2025
సిద్దిపేట: ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నాలు!

సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నికల కోసం అనేక గ్రామాల్లో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఏకగ్రీవం అయిన పంచాయతీలకు రూ.10 లక్షల నజరానా ప్రకటించిన నేపథ్యంలో, పోటీలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులతో కలిసి పెద్ద నాయకులు మంతనాలు జరుపుతున్నారు. ఇతర పోటీదారులు రంగంలోకి దిగకుండా ఉండేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
News November 27, 2025
యూరియా కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్తకూడదు: మంత్రి అచ్చెన్న

రబీ సీజన్ను దృష్టిలో ఉంచుకుని యూరియా కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్తకూడదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ క్యాంప్ ఆఫీస్లో సంబంధిత అధికారులు సమీక్షా నిర్వహించారు. రబీకి అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉండేలా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
News November 27, 2025
వనపర్తి జిల్లాలో మొదటి రోజు 75 నామినేషన్లు దాఖలు..!

వనపర్తి జిల్లాలో మొదటి విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీలకు నేడు మొత్తం 75 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ ఘణపురం మండలంలో 28 నామినేషన్లు.
✓ గోపాల్ పేట మండలంలో 13 నామినేషన్లు.
✓ పెద్దమందడి మండలంలో 16 నామినేషన్లు.
✓ రేవల్లి మండలంలో 12 నామినేషన్లు.
✓ ఏదుల మండలంలో 6 నామినేషన్లు దాఖలయ్యాయి.


