News July 31, 2024

NLG: భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు

image

భూముల విలువను ప్రభుత్వం పెంచుతున్నట్టు ప్రచారంతో రిజిస్ట్రేషన్లు భారీగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు 10, 20 రిజిస్ట్రేషన్లు అయ్యేచోట 40 నుంచి 50 వరకు, 70, 80 అయ్యే చోట 150 నుంచి 180 వరకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఆగస్టు 1 నుంచే ధరలు పెరుగుతాయని ప్రచారం సాగుతుండటంతో వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. దీంతో కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.

Similar News

News October 21, 2025

NLG: సర్కారు టాస్క్.. రాజగోపాల్ రెడ్డి స్పందించేనా!

image

మునుగోడు.. ఇప్పుడు ఈ పేరు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గంలో మద్యం దుకాణాల ఏర్పాటుపై MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం వ్యాపారులకు పెట్టిన రూల్స్ పాటించాల్సిందే అంటూ ఇటీవల ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సర్కారు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం విక్రయాలపై రాష్ట్ర మొత్తం ఒకటే పాలసీ ఉంటుందని.. వ్యాపారులు భయపడవద్దని ఎక్సైజ్ మంత్రి జూపల్లి పేర్కొన్నట్లు సమాచారం.

News October 21, 2025

తెరుచుకోని కేంద్రాలు.. గ్రామాల్లో దళారుల తిష్ట

image

దళారులు చేతిలో పత్తి రైతులు దగాకు గురవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం పత్తి పంట చేతికొచ్చింది. ఇప్పటికే పత్తి మొదటి దశ పత్తి ఏరడం పూర్తయి రెండో దశ కూడా ఏరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈసారి 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నేటికీ పత్తి కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు గ్రామాల్లో తిష్ట వేసి కొనుగోళ్లు చేస్తున్నారు. దీపావళి తర్వాతే సీసీఐ కేంద్రాలను ప్రారంభించనున్నారు.

News October 20, 2025

జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

image

అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రేపు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘స్మృతి పరేడ్‌’ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ప్రజలు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని, అమరులకు నివాళులర్పించాలని ఆయన కోరారు.