News April 16, 2025

NLG: మరోసారి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

image

నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ 17 నుంచి 15 వరకు జరగాల్సిన డిగ్రీ పరీక్షలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు సీఓఈ డా. ఉపేందర్ రెడ్డి బుధవారం తెలిపారు. తదుపరి నిర్వహణ తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అంతకుముందు ఏప్రిల్ 11, 15, 16న డిగ్రీ పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే.

Similar News

News February 25, 2026

కడప: 3వ రోజు ఇంటర్ పరీక్షలకు 96% విద్యార్థులు హాజరు

image

కడప జిల్లాలో బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్-1 పరీక్షకు 96% విద్యార్థులు హాజరయ్యారు. నేడు 62 సెంటర్లలో 18,165 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 17,391 మంది రాశారు. 774 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 16,685 మందికి గాను.. 16,068 మంది హాజరవ్వగా, 617 మంది పరీక్షలు రాయలేదు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,480 మందికి గాను.. 1,323 మంది హాజరవ్వగా, 157 మంది గైర్హాజరయ్యారు.

News February 25, 2026

ఉపాధి పనులు శనివారంలోపు ప్రారంభించాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ, ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర అంశాలపై కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకం కింద మంజూరైన పనులన్నీ శనివారం నాటికి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్రకు నమోదు చేసుకున్న వారందరూ తప్పనిసరిగా పరీక్షలకు హాజరు కావాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.

News February 25, 2026

‘మామ్స్ బ్రెయిన్’ అంటే ఏమిటి?

image

సాధారణంగా ప్రసవం తర్వాత కొందరు మహిళలు మతిమరుపునకు లోనవుతుంటారు. దీన్నే”మామ్స్ బ్రెయిన్” అంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. డెలివరీ తర్వాత బిడ్డ సంరక్షణలో పడి పోషకాహారం తీసుకోవడం మానేస్తారు. బాలింతలు మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు, పండ్లు, పప్పు దినుసులు తీసుకోవడం వల్ల బాలింతలు ఆరోగ్యంగా ఉండి మతిమరుపు, ఇతర సమస్యలకు దూరంగా ఉండవచ్చు.