News July 18, 2024
NLG: మరో మూడు రోజులు గడువు తేదీ పొడగింపు

NLG జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐలలో 2024-25/26 సంవత్సరం (ఒకటి & 2 సంవత్సరాల కోర్సులకు) అడ్మిషన్ కొరకు రెండవ విడత ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశాన్ని ఈ నెల 21 వరకు పొడిగించడం జరిగిందని జిల్లా ఐటిఐల కన్వీనర్/ ప్రిన్సిపాల్ ఎ. నర్సింహ్మ చారి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 15, 2025
పరిశోధనలే సమాజానికి దిక్సూచి: ఎంజీయూ వీసీ

విద్యాలయాలలో జరిగే పరిశోధనలే సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తాయని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. 2028లో జరగనున్న మూడో విడత నాక్ మూల్యాంకనంపై ఐక్యూఏసీ ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పరిశోధనల నాణ్యత పెంచాలని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు.
News October 15, 2025
నల్గొండ: బాలికపై అత్యాచారం.. ఏడేళ్ల జైలు శిక్ష

నల్గొండలో మైనర్పై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉప్పల నాగార్జునకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధించింది. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి తీర్పు చెప్పారు. 2019లో మోతే పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.
News October 15, 2025
NLG: జిల్లాకు కొత్తగా ఎనిమిది మంది ఎంపీడీవోలు

జిల్లాకు కొత్తగా 8 మంది ఎంపీడీఓలు రానున్నారు. ఇటీవల గ్రూప్-1 ద్వారా ఎంపికైన వారిలో జిల్లాకు 8 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం కేటాయించింది. అయితే వారిలో ముగ్గురు విధుల్లో చేరి తిరిగి HYDలో శిక్షణకు హాజరుకానున్నారు. మిగతా వారు ఇప్పటికే ఇతర శాఖల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నందున శిక్షణ అనంతరం ఆ శాఖలో రిలీవై ఎంపీడీవోలుగా విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది. వీరి రాకతో జిల్లాలో ఎంపీడీఓల కొరత తీరనుంది.