News April 2, 2024

NLG: మామిడి పండ్ల ధరలకు రెక్కలు

image

ఉమ్మడి జిల్లా ప్రజలకు ఈ ఏడాది మామిడి మహా ప్రియం కానుంది. సీజన్‌ లేట్‌గా ప్రారంభమైంది. పంట ఆలస్యం కావడం.. తక్కువ దిగుబడి రావడమే కారణం. దీంతో మామిడి ప్రియుల జేబులు ఖాళీ కానున్నాయి. ఎందుకంటే హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే మామిడి పండ్ల ధరలు కేజీ రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతున్నాయి. జిల్లాలో ఈసారి కాత ఆశించినంత లేకపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో ధరలు కూడా భగ్గుమంటున్నాయి.

Similar News

News April 20, 2025

అమృత్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి:కలెక్టర్ 

image

హాలియా మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అమృత్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. శనివారం ఆమె నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డితో కలిసి హాలియా మున్సిపల్ కార్యాలయంలో అమృత్ పథకం కింద చేపట్టిన తాగునీటి పనులపై ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్‌లతో సమావేశం నిర్వహించారు.

News April 19, 2025

MGU పీజీ, ఎంసీఏ, ఐపీసీ మూడో సెమిస్టర్ ఫలితాల విడుదల

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ మూడవ సెమిస్టర్ ఐపీసీ, ఎంసీఏ, ఐఎంఏఈ మూడో సెమిస్టర్ ఫలితాలను సీఓఈ డా. ఉపేందర్ రెడ్డి శనివారం విడుదల చేశారు. ఫలితాల పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చూసుకోవాలన్నారు. .

News April 19, 2025

కేతేపల్లి: తండ్రి మందలించడంతో యువకుడి సూసైడ్

image

తండ్రి మందలించడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. కేతేపల్లి మండలం వెంకన్నపల్లికి చెందిన కొండయ్య(32) డ్రైవర్‌గా పనిచేసేవాడు. బైక్‌ విషయంలో తండ్రి, కొడుకు మధ్య గొడవ జరగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 16న పురుగు మందు తాగాడు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!