News August 8, 2024

NLG: మాల మహానాడు నేతల ఢిల్లీ బాట

image

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర నేతలు పలువురు నల్గొండ నుంచి ఇవాళ బయలుదేరి వెళ్లారు. ఈనెల 8, 9,10 వ తేదీలలో ఢిల్లీలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు పరిమి కోటేశ్వరరావు, నల్గొండ, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు, పిట్టల భాగ్యమ్మ తెలిపారు. రంగరాజు స్వర్ణలత, లలితలు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

Similar News

News January 10, 2026

నల్గొండ: వేరే రాష్ట్రంలో దాక్కున్నా.. పోలీసులు వదల్లేదు

image

రెప్పపాటులో ప్రయాణికుల ఆభరణాలను మాయం చేసే అంతరాష్ట్ర ‘థార్’ ముఠా దొంగతనం ఉదంతాన్ని జిల్లా పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానంతో 15రోజుల పాటు మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లాను జల్లెడ పట్టినCCS బృందం, ముఠా సభ్యుడైన షా అల్లా రఖాను అరెస్టు చేసింది. నిందితుడి వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.

News January 10, 2026

నల్గొండ: నేటి నుంచి టీసీసీ పరీక్షలు

image

నల్గొండ జిల్లాలో టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. డ్రాయింగ్, టైలరింగ్ కోర్సుల కోసం జిల్లా కేంద్రంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1550 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనెల 13 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో (ఉదయం 10-1, మధ్యాహ్నం 2-5) పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

News January 10, 2026

NLG: రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి వరకు ఛాన్స్

image

సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. సంక్రాంతి పండుగ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని రైతులు తమ పరిధిలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2025 సంవత్సరానికి గాని పథకం అమలు కోసం ప్రభుత్వం 8 కోట్లు విడుదల చేసింది.