News July 23, 2024

NLG: రుణమాఫీ కోసమే భారీగా దరఖాస్తులు

image

కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి రెవెన్యూ, రుణమాఫీ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. బాధితులు భారీగా తరలిరావడంతో కలెక్టరేట్ మీటింగ్ హాల్ తో పాటు బయట ఆవరణ అంతా జనంతో నిండిపోయింది. మొత్తం 96 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో భూసమస్యలకు సంబంధించి 53.. ఇతర అంశాలవి 43 ఫిర్యాదులు ఉన్నాయి. రుణమాఫీ కాలేదంటూ సుమారు వంద మంది రైతులు అర్జీలు అందజేశారు.

Similar News

News February 22, 2026

CM కప్.. ఫైనల్‌లో నల్గొండ హాకీ జట్టు

image

హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలలో నల్గొండ బాలుర హాకీ జట్టు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్‌లో వనపర్తి జట్టుపై 1-0 తేడాతో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. రేపు జరిగే ఫైనల్స్‌లో నిజామాబాద్ జట్టుతో తలపడనుంది. జట్టు విజయం పట్ల జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ హర్షం వ్యక్తం చేశారు.

News February 22, 2026

NLG: కుమ్మెర జాతరలో శిశువు మృతిపై NHRCకి ఫిర్యాదు

image

కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష కారణంగా రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. మర్రిగూడ మండలం కమ్మగూడెంకు చెందిన న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.

News February 22, 2026

NLG: SLBC ఘటన.. దొరకని ఆరుగురి ఆచూకీ

image

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మట్టి దిబ్బల కిందే తమ వారు కలిసిపోయారన్న వేదనలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు.