News February 11, 2025
NLG: రూ.113.33 కోట్ల రైతు భరోసా జమ

జిల్లాలో రెండెకరాలలోపు భూమి ఉన్న 1,85,545 మంది రైతుల ఖాతాల్లో రూ.113,33,74,857 రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. ఇంతకు ముందు జనవరి 26న 31 మండలాల్లో ఎంపిక చేసిన 31 గ్రామాల రైతులకు 35,568 మంది రైతుల ఖాతాల్లో 46,93,19,160 జమ చేసింది. మిగతా రైతులకు దశలవారీగా డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
Similar News
News January 11, 2026
నల్గొండ ‘కార్పొరేషన్’.. గెజిట్ కోసం నిరీక్షణ!

నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మారుస్తూ శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్ద ఉంది. దీనిపై గెజిట్ విడుదల కావాల్సి ఉండటంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేసినప్పటికీ, తుది జాబితా ప్రదర్శనను ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. గెజిట్ వెలువడితేనే 48 వార్డుల పునర్విభజన, మేయర్ పదవి రిజర్వేషన్లపై స్పష్టత రానుంది.
News January 10, 2026
రాష్ట్ర అండర్-17 ఫుట్బాల్ జట్టు కెప్టెన్గా నల్గొండ వాసి

అనుముల మండలంలోని హాలియా పట్టణానికి చెందిన చింతలచెరువు తేజు తెలంగాణ రాష్ట్ర అండర్-17 ఫుట్బాల్ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈ నెల 12 నుంచి 16 వరకు హరియాణాలో జరిగే 69వ జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో ఆయన జట్టుకు నాయకత్వం వహించనున్నారు. గత నవంబర్లో నల్గొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను తేజుకు ఈ గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో రాణించాలని పలువురు ఆకాంక్షించారు.
News January 10, 2026
నల్గొండ: వేరే రాష్ట్రంలో దాక్కున్నా.. పోలీసులు వదల్లేదు

రెప్పపాటులో ప్రయాణికుల ఆభరణాలను మాయం చేసే అంతరాష్ట్ర ‘థార్’ ముఠా దొంగతనం ఉదంతాన్ని జిల్లా పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానంతో 15రోజుల పాటు మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాను జల్లెడ పట్టినCCS బృందం, ముఠా సభ్యుడైన షా అల్లా రఖాను అరెస్టు చేసింది. నిందితుడి వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.


